Quantcast
Channel: Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences in telugu
Viewing all 726 articles
Browse latest View live

గురుభక్తి 7 వ.భాగమ్

$
0
0

Vaikuntha Ekadashi - Shri Sai Baba's Nirvikalpa Samadhi, Shri Guru ...
Two Beautiful Pink Roses White Background — Stock Photo ...

24.06.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు– 
బాబా సమాధానాలు– 10 (7)
గురుభక్తి 7 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com


ఆసనమును శయ్యను వస్త్రమును వాహనమును భూషణాదులను గురువును సంతోషపరచుటకు గాను సమర్పించవలెను.
                                                గురుగీత  శ్లో.  50
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 11 బాబా తమ యాసనము కొరకు ఒక గోనెసంచి నుపయోగించెడివారు.  భక్తులు దానిపై చిన్న పరుపు వేసి, ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి.  బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారివారి భావాన్ననుసరించి తనను పూజించుటకెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి.  కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి.  కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి.  కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి.


               The Guru Shishya Parampara - A Remarkable Hindu Tradition

జ్ఞానమునందు ఆసక్తి గలవాడు సన్యాసి యగుచున్నాడు.  తనకు సత్కారములు లభించుననియు, పూజలు లభించుననియు, గౌరవములు ప్రాప్తించుననియు భావించి దండ కాషాయములను ధరించువాడు సన్యాసి గానేరడు.

                                  గురుగీత  --  శ్లో.  152

(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 37  చావడి ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు.  వాసన చూచుటకు పువ్వులగుత్తులను చేతికిచ్చేవారు.  బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యముల కవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని లెక్క పెట్టువారు కారు.  భక్తులందుగల యనురాగముచే, వారి సంతుష్టికొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి.)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.6 రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక సంస్థానముగా రూపొందెను.  వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి.  అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రధము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహూకరింపబడెను.  ఉత్సవమునకు ఏనుగులు కూడ వచ్చెను.  ఇవన్నియు ఎంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రములక్ష్యపెట్టక యధాపూర్వము నిరాడంబరులై యుండెడివారు.)
             Shirdi Sai Baba Temple, Religious Destinations, Travelguru Blog
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 14 దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు, ధునికొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతదానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు.  50 రూపాయలు మొదలు ఒక రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు.  షిరిడీ సంస్థానములొ నున్న విలువైన వస్తువులన్నియు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి.  ఎవరయిన విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు.  నానాసాహెబ్ చాందోర్కరుతో, తన యాస్తియంతయు నొక కౌపీనము, ఒక విడిగుడ్డ, యొక కఫనీ, యొక తంబిరేలు గ్లాసు మాత్రమే యనియు అయినప్పటికి భక్తులనవసరమైన నిష్ప్రయోజనమయిన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు.)

దేవాదిదేవా! భగవాన్! స్వామి! ప్రభో! కులపతీ! అని గురుదేవుని సంబోధించుచు సదా గురుభక్తితో మెలగవలెను..
                                     గురుగీత -  శ్లో. 148

మహల్సాపతి ఎల్లప్పుడు బాబాని దేవా! అనే సంబోధించెడివాడు.  



ఎవని అనుగ్రహము ప్రాప్తించుట చేత గొప్పదియగు అజ్ఞానము విడుబవడుచున్నదో అట్టి గురుదేవుని అభీష్టసిధ్ధి కొరకు నమస్కరించుచున్నాను.
                                       గురుగీత శ్లో. 36
గురుదేవుని ముఖకమలమునందు శోభించు బ్రహ్మవిద్య గురుభక్తి చేతనే పొందబడుచున్నది.  ఈ సత్యమును దేవఋషులు, మానవులు స్పష్టముగా చెప్పుచున్నారు.
                                      గురుగీత శ్లో.  43
ఏ గురుదేవుని స్మరించుట చేత జ్ఞానము స్వయముగా ఉదయించుచున్నదో అట్టి గురువే సమస్త సంపదయై యున్నాడు.  కనుక గురువును పూజించాలి.
                                      గురుగీత  శ్లో. 55
గురువును శిష్యుడు ఏప్రకారముగా సేవిస్తాడో ఆప్రకారమే గురువుయొక్క దయచేత శిష్యునకు జ్ఞానము కలుగుతుంది.  అంతేకాదు, శిష్యునిలో ఉన్న అజ్ఞానము పటాపంచలవుతుంది.  త్రికరణ శుధ్ధిగా గురువే దైవమని గ్రహించుకోవాలి.

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.8  మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన, వెంటనే భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట.  ఆధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికి పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంధములెన్ని చదివినను తెలియనట్టిదియునగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును.  నక్షత్రములన్నియు కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుచుచున్నాడో యట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంధములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. )

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.32 లో బాబా చెప్పిన మాటలుపుస్తకజ్ఞానమెందుకు పనికిరానిది.  మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి, తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను.  గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు.  ఇట్టి ప్రత్యయమేర్పడుటకు, ధృఢమైన యంతులేను నమ్మకమవసరము”)

( శ్రీ సాయి సత్ చరిత్ర అ.21 కన్నడ యోగితో బాబా అన్న మాటలుఊరకనే గ్రంధములు చదువుట వలన ప్రయోజనము లేదు.  నీవు చదివిన విషయమును గూర్చి జాగర్తగ విచారించి, అర్ధము జేసుకుని, యాచరణలో పెట్టవలెను.  లేనిచో ప్రయోజనము లేదు.  గుర్వనుగ్రహము లేని ఉత్త పుస్తకజ్ఞానము నిష్ప్రయోజనము”)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.39  బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు.  ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు(భగవద్గీత 4 . శ్లో34) బాబా చక్కని యర్ధమును నానాసాహెబ్ చందోర్కరుకు బోధించి ఆశ్చర్యము కలుగచేసెను.  ఈ విషయమును గూర్చి బి.వి.దేవుగారు (శ్రీ సాయి లీల సంపుటి 4 పుట– 563 ‘స్ఫుటవిషయనందు) వ్రాసినారు.  వారు స్వయముగా నానా సాహెబ్ చందోర్కర్ వద్దనుంచి కొన్ని సంగతులు తెలిసికొని ఇచ్చిన వృత్తాంతము)     
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)                        



గురుభక్తి 8 వ.భాగమ్

$
0
0
jeevanadi,online jeevanadi reading,atri maharishi
            Two Pink Rose Stock Photo 41814749 - Megapixl
26.06.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (8)
గురుభక్తి 8 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేటహైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com



ఎవనికితనఇష్టదైవమునందుగలఉత్కృష్టభక్తిసదాగురుదేవునియందునిలిచియుండునోఅట్టివానికిసర్వవేదాంతవిషయములుఅనుభవమునకుఅందును.
                                      గురుగీత   శ్లో.  19
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.10 భక్తులయొక్క యంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి, సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును.)


గురువుయొక్కతత్త్వాన్ని, గురుస్వరూపాన్నిబాగుగాఅర్ధంచేసుకోకుండాప్రతిరోజుచేయుజపము, తపము, వ్రతము, యజ్ఞము, దానము, తీర్ధయాత్రలుఇవన్నికూడానిష్ర్పయోజనం.
                                      గురుగీత  శ్లో.  24
తనగురుదేవునిపవిత్రనామమునుకీర్తించడమేఅనంతుడగుపరమేశ్వరునియొక్కకీర్తనమగును.  గురునామమునుధ్యానించడమేఅవ్యయుడైనమహేశ్వరునినామమునుధ్యానించుటయగును.
                                      గురుగీతశ్లో.  33
( శ్రీసాయిసత్చరిత్ర. 26 ఎవరికయితేనమ్మకముఓపికగలదోవారినితప్పకభగవంతుడురక్షించును. 
దేవునివలెయోగీశ్వరులుకూడతమభక్తులపయినాధారపడెదరు.  భక్తుడుహృదయపూర్వకముగను, మనఃపూర్వకముగనుపూజించిశరణువేడునోవానికేభగవంతుడుతోడ్పడును)

ఎంతటిఆత్మజ్ఞానిఅయినాగురువు, శాస్త్రం, ఈశ్వరుడుమూడింటిమీదభక్తివిశ్వాసాలుకలిగిఉండాలి.  అసలుభక్తిఅంటేఏమిటి?  కొంతమందిభగవంతునియొక్కవిగ్రహాన్నిచక్కగాపూలతోఅలంకరించి, నైవేద్యాలనుసమర్పించడమేభక్తిఅనిఅనుకోవచ్చు.  కాని, నిర్మలహృదయంతోభగవంతునిసచ్చిదానంద దివ్యవిగ్రహాన్నిమనసులోధ్యానించడమేభక్తి.
అనగామనంమనసద్గురువుయొక్కరూపాన్నినిర్మలమయిన హృదయంతో  మనలోనిలుపుకోవాలి.
                       Why God desired devotion to the Immaculate Heart - Our Lady's Blue ...
                 Shri. Shirdi Sai baba Samadhi Mandir Live darshan. live online ...
వరిపైరుకునీరుఎంతముఖ్యమోసాధనచేసేవారికితమగురువుపైనభక్తికూడాఅంతేముఖ్యం.  భక్తిలేకుండాచేసేఏకర్మలయినాసరేవర్షంలేనివ్యవసాయంలాగానిరుపయోగం.

ఊరికేమనసద్గురువుకిపూజలుచేసి, ఆయనచరిత్రపారాయణచేసినంతమాత్రానమనగురువుమీదమనంభక్తినినిలుపుకోలేము.  ఆయనమీదమనంధృఢమయినభక్తినిపెంపొందించుకోవాలి.  సత్చరిత్రలోబాబాచెప్పినమాటలు.

నాకుపూజాతంతుతోపనిలేదు.  షోడసోపచారాలుఅవసరంలేదుఅని.  బాబాఅలాచెప్పారుకదాఅనిమనంఆయనకుఅసలుపూజలేచేయకుండావదలివేయమనికాదు.  ఆయనరూపాన్నేకళ్ళలోనిలుపుకొనిమనసులోధ్యానంచేయాలి.  ఆయనచెప్పినఉపదేశాలనుపాటిస్తూఉండాలి.
(ఎప్పుడయితేఆయనఉపదేశాలనుపాటిస్తూఆయనమార్గంలోఅనుసరించేవాడుg, తనసద్గురువుకు, తనకుమధ్యఅడ్డుగోడఏమీలేదనే స్థితికి చేరుకుంటాడు.  ఆవిధమయినభావనభక్తునిమనసులోఎప్పుడయితేవస్తుందోఇకపూజాతంతుతోపనిలేదు.  సద్గురువుకు, భక్తుడు/శిష్యునికిమధ్యఎటువంటిభేదంఉండదు.)

నిత్యముగురుదేవునిరూపమునేస్మరింపవలెను.  గురుదేవునినామమునేసదాజపించవలెను.  గురుదేవునియొక్కఆజ్ఞనుపాటించవలెను.  గురుదేవునికన్ననుఅన్యమైనదానినిభావించకూడదు.
                                         గురుగీత  శ్లో.  39
గురువుయొక్కరూపమేధ్యానమునకుకారణం.  గురువుయొక్కపాదమేపూజించుటకుకారణము.  గురువాక్యమేమంత్రమునకుకారణము.  గురుకృపయేమోక్షమునకుకారణము..
                                         గురుగీత  శ్లో.  86
శిష్యులుఅన్యచింతలులేనివారైసదాగురుమూర్తినేఆరాధించుచుందురోఅట్టివారుఉత్కృష్టమైనసుఖమునుసులభముగాపొందుచున్నారు.  కనుకసర్వవిధములగురుదేవునిసేవింపుము.
                                         గురుగీత  శ్లో. 42
( శ్రీసాయిసత్చరిత్ర. 13 “ఎవరుఅదృష్టవంతులో, ఎవరిపాపములుక్షీణించినవో, వారేనన్నుభజించుటయందుతత్పరులైనన్నెఱుగగలరు.  ఎల్లప్పుడుసాయిసాయిఅనిస్మరించుచుండినసప్తసముద్రములుదాటించెదను.)

ఉత్తమమైనభక్తుడుతనసద్గురువునుగాని, భగవంతుడినిగానిఎప్పుడూమర్చిపోడు.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

గురుభక్తి 9 వ.భాగమ్

$
0
0
   Sri Dattatreya Sai Ashram, Dhenkanal. - Posts | Facebook

      CATTERPILLAR FARM Bubblegum Pink Rose Flower Plant Home Garden ...

27.06.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (9)
గురుభక్తి 9 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేటహైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాయిభక్తులందరికి ఒక మనవి...

బాబాగారి ఆదేశానుసారం ఈ రోజునుండి చంద్రశేఖరాష్టకమును (పరమశివుడు) వినడం ప్రారంభించాను.  దీనితోపాటుగా మనస్వినీదేవి (నాగదేవత) ను కూడా పూజించవలెను.
ఈ కరోనా కష్టకాలములో ప్రతివారు పఠించవలసినది శ్రీ చంద్రశేఖరాష్టకము.
దీని వలన అపమృత్యు దోషం పరిహరిస్తానని, వారిని రక్షించి తీరుతానని స్వయముగా పరమశివుడె చెప్పినాడు.  (మార్కండేయ చరిత్ర)
                                (చంద్రశేఖరాష్టకం)
(అందరూ ప్రతిరోజూ ఈ చంద్రశేఖరాష్టకాన్ని పఠించండి, లేక వినండి)

సకలమునకుకారణమైనగురుమూర్తితనకుఏకారణములేనివాడైయున్నాడు.  గురువేపరమదైవము.  గురుమంత్రమునకుసమానమగుమంత్రములేదు.  అట్టిగురుదేవునకుప్రణామములు.
                                       గురుగీత  శ్లో.  80


ప్రపంచమంతయుగురుదేవునియందేఉన్నది.  ప్రపంచమునందుఉన్నదిగురుమూర్తియే.  కనుకవిశ్వరూపమంతయుగురుస్వరూపముకంటెనుఅన్యముకాదు.  అట్టిగురుదేవునకువందనములు.
                                       గురుగీత  శ్లో.  81
          guru sishya | Harmonium
గురుదేవునిభోధననుసరించిమనస్సునుశుధ్ధిచేసుకోవాలి.  ద్వైతముకొంచముతెలిసిననుఅనిత్యమగుదానినిఖండించాలి.
                                       గురుగీతశ్లో.  126
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.10 “ఎవరైనను మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు.  ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు”)
( శ్రీ సాయి సత్ చరిత్ర అ.18 – 19 “ఏదైన సంబంధముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు.  ఎవరుగాని యెట్టి జంతువుగాని నీవద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము.  వానిని సాదరముగా చూడుము.  దాహము గలవారికి నీరిచ్చినచో ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, వస్త్రములు లేనివారికి వస్త్రములు, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసికొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును.  ఎవరైన ధన సహాయము గోరి నీవద్దకు వచ్చినచో, నీకిచ్చుటకిష్టము లేకున్న నీవు ఇవ్వనక్కరలేదు.  కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు.  ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము.  అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును.  ప్రపంచము తలక్రిదులయినప్పటికి నీవు చలించకుము.  నీవున్న చోటనే స్ఠైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము.  నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది.  దానిని నశింపచేయనిది మనకు ఐక్యత కలుగదు.”

ప్రక్కనించి లేవగనే నీ కేమయిన మంచి యాలోచన కలిగిన, దానిని తరువాత పగలంతయు వృధ్ధి చేసినచో నీ మేధాశక్తి వృధ్ధి పొందును.  నీ మనస్సు శాంతి పొందును.
పరులను నిందించుట గురించి ఇదే అధ్యాయంలో  బాబా ఏమని చెప్పారో మరొక్క సారి మరలా గుర్తుకు తెచ్చుకుందాము.  మలినమును పోగొట్టుటకనేక మార్గములు గలవు.  సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును.  పరులను నిందించువాని మార్గము వేరు.  ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును.  ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు.  ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు.  కావున తిట్టబడినవాడు, తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను.  ఆ విధంగా బోధిస్తూ బాబా ఒక వరాహాన్ని చూపించిఆ పంది అమేధ్యమును యెంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే.  ఎంత ఆనందముగా నీ సాటిసోదరుని తిట్టుచున్నావు.  ఎంతయో పుణ్యము చేయగ నీకీ మానవ జన్మ లభించినది.  ట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?’ అని మరొకరిని నిందిస్తున్న వ్యక్తికి బాబా బోధించారు.}

బాబా ఉపదేశములకు పరిమితి లేదు. అడ్డు లేదు.

ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు.  మేలొనరించు పనులనే చేయుచుండవలెను.  ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములేమియు నాలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు.
బాబా కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు.  కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మరామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంధములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు బంపుట, కొందరికి విష్ణుసహస్రనామములు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను.  

  కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చువారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు.  కొందరికిగురుబ్రహ్మాది మంత్రార్ధములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి.  వారి మార్గములను జెప్పుటకలవి గాదు.  ప్రపంచ విషయములలో తమ ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు.)
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా ఉపదేశించిన బోధనలను ఆచరణలో పెట్టినట్లయితే మన మనస్సు శుధ్ది అవుతుంది.
శ్రీ సాయి సత్చరిత్రను బాగా అవగాహన చేసుకున్నట్లయితే ఇతరులను వారి ఎదుట గాని,  పరోక్షంగా గాని నిందించవలసిన ఆలోచన కలిగినవెంటనే అనగా వరాహం గురించి చెప్పిన మాటలు గుర్తుకు రావాలి.  వచ్చిన వెంటనే నోరు మూత పడిపోతుంది.  ఇక ఎదుటివారిని నిందించడానికి మనస్సు ఒప్పదు.  ఆవిధంగా మనస్సు కొంత వరకు శుధ్ధి అయినట్లే.  లేనట్లయితే శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన ఫలితం ఏమీ ఉండదు.
ఏప్రకారముగానయినా గ్రుడ్డివానికి ఇది, అది అనెడి రూపభేదము తెలియదో, అట్లు గురూపదేశము లేక తత్త్వజ్ఞానము కలుగదు.  కాబట్టి తత్త్వజ్ఞానము కలుగుట కొఱకు గురువును ఆశ్రయించి వారివలన వేదాంతోపదేశమును పొందవలయును.
సద్గురువు బోధనలను శ్రధ్ధగా విని మననమొనర్చుకుని, వాటిని అమలులో పెట్టినపుడే ఆ సద్గురువు బోధలకు సార్ధకత ఉండును.
గురుబోధ ద్వారానే ఆత్మజ్ఞానమందుతుంది.  అనగా స్వయం కృషితో ఆత్మజ్ఞానం లభించేది కాదు.
ఆధ్యాత్మిక విద్యలో శిష్యునిలో తెలుసుకోవాలనే ఆసక్తే గురువుకు సమర్పించుకునే గురుదక్షిణ.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

గురుభక్తి 10 వ.భాగమ్

$
0
0
     Sri Dattatreya Sai Ashram, Dhenkanal. - Posts | Facebook
  Bunch of 30 Pink Roses
28.06.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (10)
గురుభక్తి 10 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేటహైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

గురుకృపలేనిదేమనసుపరమాత్మయందులయించిశాంతించుటదుర్లభము.
                                   గురుగీతశ్లో.  128
( శ్రీసాయిసత్చరిత్ర.13 హరిప్రసన్నుడైనపుడెమాయనుండితప్పించుకొనుటసాధ్యం.  నిరంతరహరిభజనయేదానికిమార్గం.)
గురుమార్గముననుసరించువారికిఉత్తమమగుమోక్షములభించుచున్నది.  అందువలనమోక్షమునుకాంక్షించువాడుగురుభక్తినిచేయవలెను.
                                    గురుగీత  శ్లో.  179
గురుదీక్ష యొక్క మహిమ చేత సమస్త కర్మలు సఫలమగును.  గురువు లభించిన సర్వము లభించును.  గురువు లేనివాడు అజ్ఞాని యగుచున్నాడు.
                                    గురుగీత  శ్లో.  194



సాష్టాంగ నమస్కారము చేత గురుదేవుని నిత్యము స్మరిస్తూ భజించాలి.  అట్టి గురుస్మరణ వలన స్ఠైర్యము కలుగును.  స్వస్వరూప స్ఠితి ప్రాప్తించును.
                                    గురుగీత  శ్లో.  97
      What is the Significance of Sashtanga Namaskaram ...
చేతులచే, పాదములచే, మోకాళ్ళచే, వక్షస్ఠలముచే, శిరస్సుచే, నేత్రముచే, మనస్సుచే, వాక్కుచే, చేయునట్టి నమస్కారమును సాష్టాంగ నమస్కారము అందురు.
                                     గురుగీత  శ్లో.  98
మన సద్గురువుకు మనము అభిమానమును వదలి సాష్టాంగ నమస్కారము చేయాలి. 
గురువే తండ్రి, తల్లి, బంధువు, ఇష్టదైవము.  సంసార మోహనాశము కొరకు అట్టి గురుదేవునకు నమస్కరించుచున్నాను.
                                      గురుగీత  శ్లో.  66
నా ప్రభువగు గురుదేవుడే లోక ప్రభువు.  నా గురుదేవుడె ప్రపంచమునకు సద్గురువు.  నాలోని ఆత్మయే సర్వభూతములలోని పరమాత్మ.  సర్వ భూతాంతరాత్ముడగు గురుమూర్తికి వందనములు.
                                       గురుగీత   శ్లో.  78
శిష్యుడు నిరహంకారిగా గురువుని చేరి సాష్టాంగ దండ ప్రణామం చేస్తే చాలు.  అపుడా గురువు అనుగ్రహంతో అతని దోషాలు నశిస్తాయి.`

పాపములనుండి విముక్తి పొందుట యెట్లన శరీరమును, వాక్కును, మనస్సును సద్గురువు పాదములకు సమర్పించి ఆ గురువు నామమునే జపించవలెనుమధురమగు సద్గురువు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము.  ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును.  సాత్త్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును

మన సద్గురువుకు మనము సర్వశ్య శరణాగతి వేడుకున్నచో మన బాధలన్నిటినీ ఆయన హస్తస్పర్శచే దహించి వేయబడతాయి.

శ్రీ సాయి సత్ చరిత్ర అ 13.  భీమాజీ పాటిల్ క్షయరోగంతో బాధ పడుతూ ఉండేవాడు.  అతడు షిరిడీకి వచ్చి బాబా వద్దకు వచ్చి తనకు వేరే దిక్కులేదని అందువల్ల చివరకు నీ పాదములను ఆశ్రయించితిని అని    మొఱపెట్టుకున్నాడు.

అప్పుడు బాబా అతనితోఊరడిల్లుము.  నీ యాతురతను పారద్రోలుము.  నీ కష్టములు గట్టెక్కినవి.  ఎంతటి పీడ, బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును.  ఇచ్చటి ఫకీరు మిక్కిలి దరార్ద్రహృయుడు.  వారీ రోగమును తప్పక బాగుచేయును.  ఆ ఫకీరు అందరిని ప్రేమతోను దయతోను కాపాడును  అని బాబా భీమాజీ పాటిల్ కు స్వప్నానుభవాన్నిచ్చి క్షయరోగము నుండి విముక్తుడిని గావించారు.

అదే విధంగా బాలాగణపతి షింపీ మలేరియా జబ్బుతో బాధపడుతూ ఎన్ని ఔషధములు వాడినను తగ్గకపోవడం చేత బాబా సన్నిధికి వచ్చి  ఆయన పాదాలనాశ్రయించాడు.  బాబా అతనితో లక్ష్మీ మందిరము వద్ద నల్లకుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పి పంపించారు.  బాలాగణపతి బాబా చెప్పినట్లు చేయగానే అతని మలేరియా జబ్బు శాశ్వతముగా పోయింది.  అదే విధంగా జిగట విరేచనములు, కలరా వ్యాధులనుండి బాపూసాహెబ్ బూటిని, చెవిపోటుతో బాధపడుతున్న ఆళంది స్వామిని, నీళ్ళ విరోచనములతో బాధపడుతున్న కాకా మహాజనిని,  ఎన్నో సంవత్సరాలుగా కడుపునొప్పితో  బాధపడుతున్న దత్తోపంతు, గంగాధరపంతు లను, మాధవరావు దేశ్ పాండె మూలవ్యాధిని, నానాసాహెబ్ చాందోర్కర్ లాంటి భక్తులెందరినో బాబా వారి వారి బాధలనుండి విముక్తులను గావించారనే విషయం శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన మనకందరికి తెలుసు.  వీరందరూ బాబా పాదాలనాశ్రయించి తమతమ బాధలనుండి ఉపశమనం పొందినవారే.  దీనిని బట్టి మనం గ్రహించుకోవలసిన విషయం.  అన్ని వ్యాధులు బాగగుటకు అసలయిన ఔషధము బాబా యొక్క వాక్కు.  ఆశీర్వాదములు మాత్రమే కాని, ఔషధములు కావు.  అందువల్ల శ్రీ సాయి సత్ చరిత్ర అ.18 – 19 లో బాబా చెప్పినట్లుగానీ గురువునందు ప్రేమ, విశ్వాసముల నుంచుము.   గురువే సర్వమును చేయువాడనియు, కర్తయని పూర్తిగా నమ్ముము.  ఎవరయితే గురువుయొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురువును బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపుడని యెంచెదరో వారే ధన్యులు.”

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


గురుభక్తి 11 వ.భాగమ్

$
0
0
       Sri Dattatreya Sai Ashram, Dhenkanal. - Posts | Facebook
         History and Meaning of White Roses - ProFlowers Blog

29.06.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (11)
గురుభక్తి 11 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేటహైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

గురువు సంతృప్తి చెందుటచేత శిష్యుడు తరించుచున్నాడు.  అణిమాది అష్టసిధ్ధులు గురుకృప చేతనే సిధ్ధించుచున్నవి.                                                                 గురుగీత --  శ్లో 253
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 18 – 19 సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండ తగిన బోధ చేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును.)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 16 – 17 సద్గురువును భగవంతునివలె కొలువవలెను.  కాబట్టి మనము సద్గురువును వెదకవలెను.  వారి కధలను వినవలెను.  వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను.)


           Power of Education and Importants of Guru «
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.47 గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును.  అట్టి పావనమైన నది కూడ యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నిటిని వారి పాదధూళిచే పోగెట్టెదరాయని యాతురతతో జూచును.  యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియును.  యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి.)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 21 భక్తిలేని సాధనములన్నియు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంధముల పారాయణ, వానిలోని సంగతులనితరులకు బోధించుట మొదలగువన్నియు నిష్ప్రయోజనము.  భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, గొప్ప జ్ఞాని అనే ప్రఖ్యాతి , నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నియు వ్యర్ధము.  కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. )

ఇక చివరిగా

పార్వతీ!  ముల్లోకములందు దుర్లభమైన దానిని నీకు చెప్పుచున్నాను.  ఆలకింపుము.  గురుదేవుని కన్నను అన్యమైనది లేదనుట పరమ సత్యము.
                                        గురుగీత  శ్లో.  21

ధ్యానవైభవంలో పరమశివుడు పార్వతీదేవికి చెప్పి195వ. శ్లోకానికి తాత్పర్యం
గురుదేవులు లేని సాధకుడు పశువుతో సమానుడు. ఒక కీటకము, పక్షిగా పిలువబడుచున్నాడు.  దానికి కారణం గురుసేవ, వారినుండి శిక్షణ, గురువు అనుగ్రహము లేక పరబ్రహ్మనును గూర్చి జ్ఞానము లేకుండుట.  అటువంటివాడు. శివునెరుగడు, జీవుని ఎరుగడు.

శ్రీసాయి సత్ చరిత్ర అ.8  ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు.  అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప యదృష్టవంతులు.

శ్రీ సాయి సత్ చరిత్ర అ. 10 గురువొకడే దేవుడు.  సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన యదృష్టమును బాగుచేయగలరు.  వారిని శ్రధ్ధగా సేవించినచో సంసారబంధములనుండి తప్పించుకొనగలము.  న్యాయమీమాంసాది షద్దర్శనములను చదువ పనిలేదు.  మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా జేసికొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము.  సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవానియందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను.  భక్తులయొక్క యంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి, సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును.

శ్రీ సాయి సత్ చరిత్ర అ. 12 “భగవంతుడు యోగుల హృదయమున నివసించును.  వాస్తవముగా వారు భగవంతునికంటె వేరుకారు.

శ్రీ సాయి సత్ చరిత్ర అ.11  విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము  ఈ ఏడును పూజనీయములు.  కాని సద్గురువు వీనియన్నిటికంటె నుత్కృష్టుడు.

దీనిని బట్టి చివరిగా మనం గ్రహించుకోవలసినది మన గురువు మీద మన భక్తి ఏవిధంగా ఉండాలనేది.  ఏవిద్యకయినా గురువు ఆవశ్యకత ఎంతయినా ఉంది.  ఆధ్యాత్మిక విద్యకు మరీ కావాలి.  ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా సద్గురువు అవసరం ఎంతయినా ఉందనే సత్యాన్ని గురుగీత బోధలద్వారా మనం బాగా అర్ధం చేసుకోవాలి.

శిష్యుడు ఆధ్యాత్మిక శిఖరాలను అందుకున్ననాడే గురువుకు తృప్తి.  బ్రహ్మజ్ఞానమును ఒసంగిన గురుడు శ్రేష్టుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉత్తమ శిష్యుడు మనోవాక్కాయ కర్మములతో గురుసేవా తత్పరుడై ఎల్లవేళలా గురువునే సంతోషపెట్టవలెను.  అట్లుచేయని శిష్యుడు కృతఘ్నుడగును.



ఒక మనవి..  నా బ్లాగులోని అనుభవాలలోని కొన్నిటిని మరొక బ్లాగులో ప్రచురించే ముందు ఒక్కసారి నాకు తెలియపరచవలసినదిగా మరొక్కసారి కోరుతున్నాను.  అంతే కాదు వాటిని ఫలానా బ్లాగునుండి తీసుకోబడినది అని కూడా ప్రచురిస్తే బాగుంటుంది.  కారణమేమంటే ఈ మధ్య నాబ్లాగులో నేను ప్రచురించిన కొన్ని అనుభవాలను మరొక బ్లాగులో చూసాను.  కాని వాటిని మరలా టైపు చేసి ప్రచురించడం వల్ల కొన్ని వాక్యాలు, సంగతులు పూర్తిగా మరుగున పడిపోయాయి.  పాఠకులకు కాస్తంత అవగాహన చేసుకోవడానికి కూడా ఇబ్బంది కలగవచ్చు.  అందువల్ల యధాతధంగా కాపీ పేస్ట్ చేసినట్లయితేఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని నా అభిప్రాయం.  బాబా గురించిన తత్త్వం సాయిభక్తులందరికీ అందాలన్నదే నా ఆకాంక్ష.
(రేపటితో గురుభక్తి ముగింపు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


గురుభక్తి 12 వ.భాగమ్

$
0
0
Dattatreya Sai | Sai baba pictures, Sai baba, Sai baba photos
Raindrops On Rose Wallpaper - Beautiful White Rose Flower (#627435 ...
30.06.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (12)
గురుభక్తి 12 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేటహైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

స్త్రీలకు భర్త ఎలాంటివాడో జీవులందరికి గురువు అటువంటివాడు.  స్త్రీలకు భర్త దైవస్వరూపుడు.  అదే విధంగా జీవులకు గురువంటే శివుడని, శివస్వరూపిగా తలంచి, అల్పమైన కోరికలను తీర్చమనడం, మహిమలను చూపమనడం అవివేకం.  గురువుని ఎన్నుకున్నాక పరీక్షించడమో, పరిత్యజించడమో శిష్యునకు హక్కు లేదు.



(శ్రీసాయి సత్ చరిత్ర అ.16 - 17 లో బాబా అన్నమాటలను గుర్తుకు తెచ్చుకుందాము..."అనేకమంది నావద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగనివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే యడుగుదురు.  నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వుమని యడుగువారు చాలా తక్కువ.  ప్రపంచ విషయములు కావలెనని యడుగువారికి లోటు లేనే లేదు.  పారమార్ధిక విషయమై యోచించువారు మిక్కిలి యరుదు.)

గురువుగురుతత్త్వం’’ కలిగి ఉండాలి.  తనను పరిపూర్ణంగా విశ్వసించిన శిష్యునకు తాను పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించవలెను.  అట్టివాడే సద్గురువుగా ఎంచబడును.
                 Guru Shishya - Hyderabad | Facebook
మనము ఎంత విద్యాధికులమయినప్పటికి మన సద్గురువు ఎదుట మౌనముగా ఉండాలి.  మనకు బాగా తెలుసుననే అహంకారాన్ని మన సద్గురువు ఎదుట ప్రదర్శించరాదు.

(శ్రీ సాయి సత్ చరిత్ర . 16 – 17 ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్ప చదువరియైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది.  ఆత్మ సాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు.  ఎవరహంకార పూరితులో, ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు.  మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము.  అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. )

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.24 మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము.  మన మహంకారరహితుల మయినచో, మన జయము నిశ్చయము.)
        The Famous Guru – Shishya Jodi
(అందుచేత శ్రీ సాయి సత్ చరిత్రలో అ. 16 – 17 నందు బ్రహ్మజ్ఞానము కోరిన వ్యక్తితో బాబా అన్న మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము.  నా ఖజానా నిండుగా నున్నది.  ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను.  కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా యని నేను మొదట పరీక్షించవలెను.)
ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామన్నది కాదు.  మన సద్గురువు ముందు ఎంత భక్తితో, వినయవిధేయతలతో ఒదిగి ఉన్నామన్నదే ముఖ్యం.

మనకు ఎన్ని ప్రవచనాలయినా చెప్పే శక్తి ఉండవచ్చు.  ఆ శక్తి మన సద్గురువు వల్లనే వచ్చిందనే విషయాన్ని మర్చిపోకూడదు.  ఆయన అనుగ్రహమే లేకపోతే మనలో అటువంటి జ్ఞాన పుష్పం వికసించేదే కాదు..  ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనలో అహంకారం మొలకెత్తకుండా జాగ్రత్త వహించాలి.  మన సద్గురువుతో మనమెప్పుడూ సమానం కాలేము.

(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 27  దాదాసాహెబ్ ఖాపర్దే సామాన్యుడు కాడు.  అమరావతిలో మిక్కిలి ప్రసిధ్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు.  ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్ప వక్త.  కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు.  అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి.  కాని ముగ్గురు మాత్రము ఖాపర్దే, నూల్కర్, బూటీ నిశ్శబ్దముగా కూర్చుండువారు.  వారు వినయవిధేయత నమ్రతలున్న ప్రముఖులు.  పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్దే బాబా ముందర ద్వారకామాయిలో కూర్చొనునప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు.  నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైననను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును.  పుస్తకజ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు.)
ఇక ముగించేముందు ఒక్క మాట
( శ్రీ సాయి సత్ చరిత్ర అ. 24 మనము గురుని స్మరించనిదే ఏవస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు.   మన మనస్సుకు ఈ విధముగా శిక్షణనిచ్చినచో  మనమెల్లప్పుడు మన సద్గురువును ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనెదము.)

బాబా గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం గురుభక్తి గురించిన వివరణలు మీముందు ఉంచాను.  గురుగీతలోని శ్లోకాలయొక్క అర్ధాన్ని, వాటికి తగినట్లుగా శ్రీ సాయి సత్ చరిత్రలోని సంగతులను, సంఘటనలను క్రోడీకరించి అసలు గురువు అనగా ఎవరు, సద్గురువు యొక్క లక్షణాలు ఏమిటి, గురువుయందు మన భక్తి ఏవిధంగా ఉండాలనే విషయాలన్నిటినీ ఇందులో పొందుపరచాను. 

దీనిని బట్టి శ్రీ సాయి సత్ చరిత్ర ఒక సామాన్యమయిన పారాయణ గ్రంధము కాదని, ఈ గ్రంధమంతా ఉపనిషత్తులు, మరియు గురుగీతా సారాంశమేనని మనం గ్రహించుకోగలము. ఇది పఠించిన సాయిభక్తులందరికి మన సద్గురువు అయిన బాబా యొక్క ఉపదేశాలను, బోధనలను మరింతగా ఆకళింపు చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
  
గురుభక్తి ఇప్పటితో ముగిస్తున్నా గాని, మనలో గురుభక్తి మాత్రం నిరంతరం ఉండాలి.  దానికి ముగింపు అనేది ఉండరాదు.

(రేపటి సంచికలో Lt.Col. Nimbalkar  గారి SHRI SAIBABA'S TEACHINGS AND PHILOSOPHY   శ్రీ సాయి  బోధనలు మరియు తత్త్వంతెలుగులోనికి అనువాదం చేసి 2016 వ.సంవత్సరంలో ఇదే బ్లాగులో ప్రచురించాను.  అందులో ప్రచురించిన గురుభక్తి గురించి అప్పుడు చదివి ఉండని సాయిభక్తుల కోసం తిరిగి ప్రచురిస్తాను.) 
(శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు భాగాలు, మరియు గురుభక్తి ఎవరయినా తమ బ్లాగులో కాని, ఫేస్ బుక్ పేజీలో గాని ప్రచురించదలచుకున్నట్లయితే కాపీ పేస్ట్ మాత్రమే చేయవలసినదిగా మనవి. చేసేముందు నాకు తెలియపరచవలసినదిగా మనవి.)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - గురుభక్తి – 1వ.భాగమ్

$
0
0
      Dattatreya and sai Baba - Yoga Vidya International
       Pink Rose Flower Bouquet Isolated On White Background Cutout Stock ...
01.07.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్ గారు రచించిన SHRI SAIBABA'S TEACHINGS AND
PHYLOSOPHY అనే పుస్తకాన్ని 2016వ, సంవత్సరంలో తెలుగులోనికి అనువదించాను.  అందులోని గురుభక్తి గురించి ఆయన పొందుపరచిన సమాచారాన్ని ఆప్పట్లో చదవని సాయిభక్తుల సౌకర్యార్ధం మరలా ప్రచురిస్తున్నాను.

05.10.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
       Image result for images of m b nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్ - సెల్: 9440375411
18. గురుభక్తి – 1వ.భాగమ్
బ్రహ్మం గురించి తెలుసుకోవాలన్నా, ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నా ఒక సద్గురువు యొక్క మార్గదర్శకత్వం వల్లనే సాధ్య పడుతుందన్న విషయం  మన భారతదేశంలో వేదాలు, పురాణాల కాలంనుంచి ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినదేమీ కాదు.
  

   తద్విజ్ఞార్ధ్ స గురుమేవామిగచ్చేత్
   సమిత్యాణి శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్
                              ముండోకోపనిషత్
         Image result for images of guru bhakti




(ఈ సృష్టికి మూలకారణమయిన బ్రహ్మం గురించి తెలుసుకోవాలంటే గురువును ఆశ్రయించాలి.  ఆగురువు వేదశాస్త్ర పారంగతుడయి ఆపరబ్రహ్మను గూర్చే చింతిస్తూ ఆయనలోనే లీనమయి ఉండాలి.  నిత్యాగ్నిహోత్రుడయి హోమం చేయడానికి చేతిలో సమిధలను పట్టుకెడుతున్నవాడయి ఉండాలి.)
                Image result for images of shirdisaibaba before dhuni
పౌరాణిక కాలంలో కూడా శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు (శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయంలో భగవద్గీతలో ఈవిషయం ప్రస్తావింపబడింది) చేసిన ఉపదేశం సాయి భక్తులందరికీ తెలుసు.   
           తద్విధ్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా    I
            ఉపదేశ్యంతే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః  II
                        శ్రీమద్ భగవద్గీత – అధ్యాయం -4 – శ్లో.34

(నీవు తత్త్వమును దర్శించిన జ్ఞానులకడకేగి, ఆ జ్ఞానమును గ్రహింపుము.  వారికి దండప్రణామములాచరించుటవలనను, సేవలొనర్చుటవలనను, కపటము లేకుండ భక్తిశ్రధ్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను, పరమాత్మ తత్త్వమును చక్కగానెఱింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆపరమాత్మ తత్త్వజ్ఞానమునుపదేశించెదరు)

సరస్వతీ గంగాధర్ వ్రాసిన గురుచరిత్ర 39వ.అధ్యాయంలో గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా గురువే పరబ్రహ్మగా అభివర్ణించారు.
        గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
        గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః

(గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు
వాస్తవానికి గురువే పరబ్రహ్మ, అటువంటి గురువునకు ప్రణామములు)
               Image result for images of guru bhakti
గురుచరిత్ర మనకింకా తెలియచేసేదేమిటంటే, దేవతలు, గంధర్వులు, పితృదేవతలు, ఋషులు, సిధ్ధులు ఎవరయినా సరే తమయొక్క గురువుకు సేవచేయనిదే జననమరణ చక్రాలనుండి తప్పించుకోలేరు. 
       న ముక్తా దేవగంధర్వః పితరో యక్షకిన్నరాః
      త్రుషయం సర్వసిధ్ధాశ్వగురుసేవా పరాడ్ ముఖాః   II 47 II

400 నుంచి 700 సంవత్సారాల క్రితమే జ్ఞానేశ్వర్ తను రచించిన జ్ఞానేశ్వరిలోను, ఏకనాధ్ మహరాజ్ తను రచించిన ఏకనాధ భాగవతంలోను, గురువుయొక్క ఆవశ్యకత గురించి మరీ మరీ చెప్పారు.

“ఆద్యంతములు లేనివానిని ఎట్లు కౌగలించుకోగలము?  అత్యంత ప్రకాశవంతమయిన వెలుతురును మరింత తెల్లని వెలుతురుగా ఏవిధంగా చేయగలము? దోమ తన పిడికిటలో ఆకాశమును ఇమడ్చగలదా?  (74)

“కాని, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే శక్తి మనమాశ్రయించిన గురువుకే ఉంది. ఆనమ్మకంతోనే నాగురువు నాయందు ఉన్నాడనే గట్టి విశ్వాసంతోనే నేను ఈ మాటలు అనగలుగుతున్నాను”  (75)
                                            జ్ఞానేశ్వరి -  అధ్యాయం – 1
(జ్ఞానేశ్వరి, అర్జున విషాదయోగం లో జ్ఞానేశ్వర్ వ్రాసిన ముందుమాటలలోనివి.)

సద్గురువుయొక్క కృపా కటాక్షణాలు లేకుండా, ఆయన సహాయం లేకుండా బ్రహ్మం గురించిగాని, ఈ విశాల విశ్వంయొక్క స్వబావాన్ని తెలుసుకోవడంగాని సాధ్యం కాదు.  (7)

“కళ్ళు ఎటువంటి లోపం లేకుండా సుందరంగా ఉండి అన్నీ స్పష్టంగా చూడగలిగిన శక్తి ఉన్నప్పటికీ, సూర్యుడు లేనిదే అంతా చీకటె “.  (8)
                          ఏకనాధ భాగవతం – అధ్యాయం – 10

సాయిబాబా కూడా నిరంతరం గురువుయొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ వర్ణించి చెబుతూ  ఉండేవారు.  ఆయన చాలా సరళమయిన భాషలో గురువును ఏవిధంగా ఆరాధించాలో, సేవచేయాలో తన స్వంత అనుభవాన్నే ఉదాహరణగా మనకు చాలా వివరంగా చెప్పారు.  అసలయిన గురుభక్తి ఏవిధంగా ఉంటుందో ఉదాహరణలుగా చూపిస్తూ అప్పుడప్పుడు కధలుగా చెబుతూ ఉండేవారు.  శ్రీసాయి సత్ చరిత్రలో గురుసేవ, గురుభక్తి గురించే ప్రత్యేకంగా  ఆరు అధ్యాయాలు ఉన్నాయి.  అంతేకాదు, శ్రీసాయి సత్ చరిత్రలో ఆరెండింటి విషయాలకు సంబంధించినవన్నీ ఒకేచోట క్రోడీకరించినట్లయితే ఆ ఓవీలన్నీ కలిపి మొత్తం 257 ఓవీలతో, మరాఠీ గురుగీత అవుతుంది. సంస్కృతభాషలోని శ్రీగురుచరిత్రలో ఈ ఓవీలన్నీ మనకు లభ్యమవుతాయి.

18,19 అధ్యాయాలను ఒకసారి గమనిద్దాము.  సంగమనేర్ నుండి రాధాబాయి అనే ఆమె కొంతమందితో కలిసి షిరిడీ వచ్చింది.  సాయిబాబా తనకు మంత్రోపదేశం చేస్తే తప్ప భోజనం, నీళ్ళు తీసుకోకుండా ఉపవాస దీక్ష చేస్తానని భీష్మించుకుని కూర్చుంది.  సాయిబాబా ఎవరికీ ఎటువంటి మంత్రోపదేశం చేయలేదు.  రాధాబాయి తను అన్నట్లుగానే తన బసలోనే ఉపవాసం ప్రారంభించింది.  మూడురోజులయినా తన దీక్షను విరమించలేదు.   ఆమె స్థితిని చూసి మాధవరావు చాలా కంగారుపడి, ఆమెను పిలిచి మాట్లాడమని బాబాను వేడుకొన్నాడు.

అప్పుడు బాబా ఆమెను పిలిపించి, “అమ్మా! నా గురువు గొప్ప యోగీశ్వరుడు, మిక్కిలి దయార్ద్రహృదయులు.  ఆయనకు నేనెంతో కాలం శుశ్రూష చేశాను.  కాని, ఆయన నాకెటువంటి మంత్రాన్ని ఉపదేశించలేదు.
                                          ( ఓ.వి. 47)

“మొదట్లో ఆయన నాగుండు గొరిగించి నానుండి రెండు కానులు దక్షిణ అడిగారు.  నేను వెంటనే దక్షిణ సమర్పించాను. నాకు మత్రోపదేశం చేయమని ఎంతో ఆశగా మరలా అడిగాను.”
                                          (ఓ.వి. 49)
  (ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

శ్రీ చంద్రభాన్ సేఠ్ వారసులతో ముఖాముఖి – 2 వ.భాగం

$
0
0

    Untitled
       Red Rose Flower Bouquet Isolated On White Background Cutout Stock ...
23.05.2020 శనివారమ్
ఓమ్సాయిశ్రీసాయిజయజయసాయి
సాయిబంధువులకుబాబావారిశుభాశీస్సులు

బాబారహతాలోనిశ్రీచంద్రబాన్సేఠ్గారిఇంటికితరచుగావెడుతూఉండేవారన్నవిషయంశ్రీసాయిసత్చరిత్రపారాయణచేసినమనకందరికితెలుసు.  కొన్నిసంవత్సరాలక్రితంసాయిపధంమాసపత్రికవారురహతావెళ్ళిశ్రీచంద్రబానుసేఠ్గారివారసులతోముఖాముఖీగామాట్లాడి, బాబాగురించికొన్నిఆసక్తికరమయినవిషయాలనుసేకరించారు.  ఇవిమనకుశ్రీసాయిసత్చరిత్రలోకనపడవు.  సంభాషణలను shirdisaitrust.org – Chennai వారినుండిగ్రహింపబడినది.
శ్రీచంద్రబానుసేఠ్గారిమనుమడుశ్రీజయచంద్రసేఠ్, ఆయనమునిమనుమడుశ్రీసురేంద్రసేఠ్లతోసాయిపధమ్వారుప్రత్యక్షంగామాట్లాడిబాబాగురించి వెల్లడించినవిషయాలను రెండవ భాగం  రోజుమీకుఅందిస్తున్నాను.  వారిసంభాషంతామరాఠీలోను, ఆంగ్లంలోనుజరిగింది.

శ్రీచంద్రభాన్సేఠ్వారసులతోముఖాముఖి– 2 .భాగం

సా..ప్రశ్నబాబా మీ ఇంటికి వచ్చినపుడు మీ ఇంటి లోపలికి  ప్రవేశించేవారా? లేక బయట వరండాలోనే కూర్చొనేవారా?

..సేఠ్ఆయన ఇంటిలోపలికే వచ్చేవారు.  అదిగో ఆ కనపడే ద్వారంలోనుండే వచ్చేవారు. (శ్రీ జయచంద్ర సేట్ గారు సాయిపధం పత్రికవారికి ఇంటి ప్రధాన ద్వారంవైపు చూపించారు)


సా..ప్రశ్నబాబాతో మీకుంటుంబానికి కలిగిన అనుభవాలను వివరిస్తారా?

..సేఠ్చెప్పాలంటే లెక్కలేనన్ని అనుభవాలున్నాయి.  బాబాతో మాకు కలిగిన అనువాలు ఎన్నని చెప్పను?  మాతాతగారు చంద్రభాన్ సేఠ్ గారు మూడు వివాహాలు చేసుకున్నారు.  ఆయనకు ఎంతోమంది సంతానం.  కాని అందరూ చనిపోయారు.  మానాన్నగారు 21.సంతానం.  చంద్రభాన్ సేట్ గారికి మగపిల్లవాడు జన్మించాడని తెలియగానే బాబా వెంటనే మా ఇంటికి వచ్చారు.  ఆయన మానాన్నగారిని తన చేతుల్లోకి తీసుకునిబిడ్దని నాప్రసాదంగా నీకు ప్రసాదిస్తున్నాను.”అన్నారు.  బిడ్డ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి పరిపూర్ణ ఆరోగ్యంతో మంచి శరీర సౌష్టవంతో పెరిగాడు.  మా కుటుంబమంతా ఈ విధంగా జీవించి ఉండటానికి కారణం బాబా మాయందు చూపుతున్న అనుగ్రహమే.  ఈ నాటికీ ఆయన మామీతన దీవెనలని అందిస్తూనే ఉన్నారు.  ఒకసారి బాబా కుశాల్ చంద్ తోచూడు కుశాల్, నేను ఈ శరీరాన్ని వదిలివేసిన తరువాత ప్రజలు నా ఎముకలను పూజిస్తారు”.  అయన దూరదృష్టితో చెప్పిన మాట నిజమయింది.

సురేందర్ చాంద్ఆరోజులలో బాబా మాయింటికి వస్తూ ఉండెవారు.  మాపండ్లతోటలు గ్రామసరిహద్దుల వరకు విస్తరించి ఉండేవి.  కొన్ని సంవత్సరాల తరువాత బావులన్నీ ఎండిపోయాయి.  నీళ్ళు లేవు.  1990 నాటికి పండ్ల చెట్లన్నీ ఎండిపోయి తోటంతా నాశనమయిపోయింది. నీటికోసం బోరుబావిని తవ్విద్దామని ఉదయం పని మొదలు పెట్టాము.  కాని సాయంత్రమయినా చుక్క నీరు పడలేదు.  సాయంత్రం బాబా సమాధి మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకున్నాను.  బాబాని ప్రార్ధించాను.  బాబా బోరుబావిలో నీరు పడేటట్లుగా అనుగ్రహించు.  ఫలవృక్షాలన్నీ మునిపటిలాగానే మీరున్న కాలంలో ఏవిధంగా ఉండేవో ఆవిధంగా మరలా పచ్చగా కళకళలాడేలాగ అనుగ్రహించు  యిదు నిమిషాలోనే బోరుబావిలో నీరు పడింది.  బాబా ఆశీర్వాదం వలన తోటలన్నీ మళ్ళీ పచ్చగా కళకళలాడాయి.

సా..ప్రశ్నబాబా అందరివద్ద దక్షిణ తీసుకునేవారు.  ఆయన మీతాతగారి వద్దనుంచి కూడా దక్షిణ తీసుకున్నారా?

..సేఠ్కుశాల్ చంద్ గారు బాబాని దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళినపుడు ఏమి ఇచ్చారో మాకు తెలియదు.  కాని బాబా మాయింటికి వచ్చినపుడు ఒక యోగీశ్వరుడిని ఇంటినుంచి రిక్త హస్తాలతో పంపించకూడదనే మేము ఆయనకి ఏదయినా సమర్పించుకునేవారము.  ఎవరయినా భక్తుడికి సహాయం చేయమని బాబా ఎప్పుడడిగినా కుశాల్ చంద్ గారు సహాయం చేస్తూ ఉండేవారు.  బాబా తనకోసం ఎప్పుడూ ఏదీ తీసుకోలేదని మాపెద్దలు చెప్పారు.

సా..ప్రశ్నబాబా మీఇంటికి వచ్చినపుడు మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు? బాబా వస్తున్నారనే సమాచారం మీకు ముందుగానే తెలిసేదా?  బాబా దర్శనం కోసం మొత్తం గ్రామంలోని ప్రజలంతా వచ్చేవారా?

..సేఠ్ -  నేనింతకు ముందు చెప్పినట్లుగానే మా పండ్లతోటలు గ్రామసరిహద్దుల వరకు విస్తరించి ఉండేవి.  తోటల్లో మాతోటమాలి లక్ష్మణ్ అనే లక్షా ఉండేవాడు.  బాబాని చూడగానే అతను పరిగెత్తుకుంటూ వచ్చి బాబా వస్తున్నారనే విషయం చెప్పేవాడు.  కుశాల్ చంద్ వెంటనే మేళతాళాలతో బయలుదేరి వెళ్ళి బాబాను, ఆయనతో కూడా వచ్చిన భక్తులందరిని సగౌరవంగా ఎంతో వైభవంగా తీసుకుని వచ్చేవారు.  బాబా రహతాలో మాఇంటిలో తప్ప మరెవరి ఇంటిలోను అడుగుపెట్టలేదు.  అందువల్ల ఇతర గ్రామస్థులు కూడా మేమంటే ఎంతో గౌరవంగా ఉండేవారు.  వారెవ్వరూ మాఇంటిలోకి అడుగుపెట్టే ధైర్యం చేసేవారు కాదు.  బాబా నతో కూడా వచ్చిన భక్తులతోను, మాకుటుంబ సభ్యులతోను కొద్దిసేపు గడిపి ఆతరువాత తిరిగి  షిరిడి వెళ్ళిపోయేవారు.  బాబా మాఇంటికి వచ్చినపుడు బాబాకు సేవ చేసిన మాతోటమాలి లక్షా ఆతరువాత లక్షాబాబా గా ఒక సాధువుగా వల్సాడ్ ప్రాంతంలో స్థిరపడ్డాడు.
(కుశాల్ చంద్ ఇల్లు, బాబా కూర్చున్న ప్రదేశం, బాబా వాడిన వస్తువులు బాబా కుశాల్ చంద్ కు ఇచ్చిన ఫోటో ఈ వీడియోలో చూడండి. బాబా కుశాల్ చంద్ తో ఉన్న వీడియో మెరే సాయి హిందీ సీరియల్ లో దొరుకుతుందేమోనని వెదకుతున్నపుడు ఈ వీడియో కనిపించింది. )






సా..ప్రశ్నబాబా మహాసమాధి చెందినపుడు కొంతమంది ఆయన పార్ధివశరీరాన్ని ముస్లిమ్ సాంప్రదాయం ప్రకారం సమాధి చేయాలని అన్నట్లుగాను,  వారిలో కుశాల్ చంద్ గారు కూడా ఉన్నారని, శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాయబడింది.  అది నిజమేనా?

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.43 బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎట్లా చేయాలని 
గ్రామస్థులంతా ముఫై ఆరుగంటల సేపు తర్జన భర్జనలతో ఆలోచించారు. ఈ శరీరానికి హిందువులచే తాకనివ్వకుండా ముసల్మానుల శ్మశానంలోనికి తీసికొనిపోవాలని ఒకరంటే, ఆరుబయట అందమైన ఒక సమాధి కట్టి అందులో ఉంచాలని మరొకరన్నారు.  ఖుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ మాటలనే సమ్మతించారు. … త్యాగరాజు)
        Shirdi Sai baba Temple | शिर्डीचे श्री साईबाबा ...
..సేఠ్మాకా సంఘటన గురించి తెలియదు.  ఆరోజుల్లో ఉపాసనీ బాబా మాతోటలోనే నివసిస్తూ ఉండేవారు.  బాబా మహాసమాధి చెందిన తరువాత ఆయన ఏడు రోజులపాటు నామ సప్తాహం నిర్వహించారు.  నాసోదరుడు దౌలత్ రామ్ నామ సప్తాహానికి అన్ని ఏర్పాట్లు చేసాడు.
(బాబా మహాసమాధి చెందిన నెలరోజులకు సరిగా15 నవంబరు, 1918 లో కుశాల్ చంద్ గారు మరణించారు.)
(సమాప్తం)
(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)


శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు – 11

$
0
0

     Shirdi Sai Baba - Lord Dattatreya Incarnate | Shirdi Sai Baba Life ...
    The Pink Double Knock Out® Rose — The Knock Out® Family of Roses
04.07.2020  శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు– 
బాబా సమాధానాలు– 11
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com
సాయి భక్తులందరకి గురుపూర్ణిమ శుభాకాంక్షలు

గృహస్థాశ్రమంలో గృహస్థుని బాధ్యత

క్రిందటివారంబాబాఇచ్చినసందేశం  గృహస్థాశ్రమంలోయజమానియొక్క పాత్రగురించిసందేశంఇచ్చారు. దానినిగురించిశోధిస్తూఉండగా 02.07.2020 గురువారమునాడుతైత్తరీయోపనిషత్తులోసమాచారందొరికింది.  దానినిమీముందుచుతున్నాను. 
తైత్తరీయోపనిషత్లోగృహస్థుడుఏవిధంగాఉండాలిఅన్నదానికిసంపూర్ణవివరణ
తనఇంటికేతెంచినఅతిధికైననుప్రతికూలసమాధానమీయరాదు.  ఆదరభావముతోఅతిధిసత్కారముచేయవలెను.  నికృష్టభావముతోమర్యాదారహితముగాఅతిధినిచూచినచోఅట్టిఫలమేతనకులభించును.  దీనినిగ్రహించిఏమానవుడువిశుధ్ధభావముతోఅతిధిసత్కారముచేయునోఅతడుసర్వోత్తమఫలమునందగలడు.


                      क्या भारत में आज भी "अतिथि देवो भव ...
గృహస్థుతనఇంటికివచ్చినఅతిధినయినానిరాదింపరాదు.  ప్రేమ, మర్యాద, శ్రధ్ధ, సత్కారభావములనుకలిగియుండవలెను.  అట్లుఅతిధులనుసేవింపవలసినదే.  దానినిమిత్తముగృహస్థుఅధికాహారమునుఏదోవిధముగాసేకరించియుంచుకొనవలెను.  ఇక్కడఏదోవిధముగాఅనగాఅర్ధంన్యాయసమ్మతముగాఆర్జించినదిఅనిఅర్ధంచేసుకోవాలి. తనఇంటికేతెంచినఅతిధినిశ్రధ్ధతో, ప్రేమతోఆహ్వానించిఅర్ఘ్యపాద్యోచితాసనాదులనర్పించి, అన్నముపెట్టవలెను.  అట్లుశ్రధ్ధాపూర్వకముగాఅతిధినిసేవించుగృహస్థుకూడఅంతటిప్రేమమర్యాదలతోకూడినఆహ్వానమును, అన్నాదులనుపొందగల్గును.

మధ్యశ్రేణిసత్కారమునుఅతిధులకిచ్చుగృహస్థుతానునుఅట్టి ఆదరముతోకూడినఅన్నమునకేపాత్రుడగును.  అతిధినిశ్రధ్ధారహితముగాచూచుగృహస్థుతానునుఅట్టిఆదరముతోకూడినఅన్నమునకేపాత్రుడగును.  అతిధినిశ్రధ్ధారహితముగాచూచుగృహస్థుతానునుఅట్టినిరాదరణమునకుఛీత్కారమునకుగురియగును.  అన్నములభించవచ్చును, కానిఆదరణమునకుచోటుండదు.  తానాచరించినకదాతనకులభించునది.  కావుననేగృహస్థులయిననుసర్వోత్తమవిధానముతోశ్రధ్ధాపూర్వకముగ, అతిధిసేవనముగావించుటప్రధానాంశమైయున్నది.

(శ్రీసాయిసత్చరిత్ర.18 – 19 బాబాఉపదేశంఒక్కసారిగుర్తుకుతెచ్చుకుందాము.
ఏదైనసంబంధముండనిదేయొకరుఇంకొకరివద్దకుపోరు.  ఎవరుగాని, ఎట్టిజంతువుగానినీవద్దకువచ్చినచోనిర్దాక్షిణ్యముగావానినితరిమివేయకుము.  వానినిసాదరముగాచూడుము.  దాహముగలవారికినీరిచ్చినచోఆకలితోనున్నవారికిఅన్నముపెట్టినచో, వస్త్రములులేనివారికివస్త్రములిచ్చినచోనీఇంటివసారాఇతరులుకూర్చొనుటకు, విశ్రాంతితీసుకొనుటకువినియోగించినచోనిశ్చయముగాభగవంతుడుప్రీతిచెందును.

ఎవరయినాధనసహాయముగోరినీవద్దకువచ్చినచో, నీకిచ్చుటకుఇష్టములేకున్ననీవుఇవ్వనక్కరలేదు.  కానివానిపైకుక్కలామొఱగవద్దు.  ఇతరులునిన్నెంతగానిందించిననునీవుకఠినముగాజవాబివ్వకుము.  అట్టివానినినీవెల్లపుడుఓర్చుకొనినచోనిశ్చయముగానీకుసంతోషముకలుగును.

అన్నంపరబ్రహ్మస్వరూపమనితైత్తరీయఉపనిషత్లో చెప్పబడింది. అన్నమునుండియేసమస్తభూతములుజనించుచున్నవి.  జనించినవిఅన్నమువలననేజీవించుచున్నవి.  అందువల్లపరబ్రహ్మస్వరూపమయినఅన్నమునునిందింపరాదు.  అన్నముయొక్కమహిమనుతెలిసికొనినవాడుసమస్తసంపదలనుపొందిమహిమాన్వితుడగును.  అన్నమునుఅవహేళనచేయరాదు.  దానినభివృధ్ధిచేయవలెను.
అతిధినిగౌరవించిబ్రహ్మమునుసర్వశ్రేష్టుడనిఉపాసించినచో, సర్వోత్తముడగును. మాతృదేవోభవ, పితృదేవోభవ,  ఆచార్యదేవోభవ, అతిధిదేవోభవఅనికూడాచెప్పబడింది. 

తైత్తరీయఉపనిషత్తులోగృహస్థుఅయినవాడుఅతిధినిఏవిధంగాఆదరించిభోజనంపెట్టవలెనోవివరంగామీరిప్పుడుచదివారు.

అతిధిని గౌరవించి అన్నము  పెట్టనట్లయితేగృహస్థుకుఅన్నములభించునుగానిఆదరముతోలభింపదుఅన్నవిషయానికిప్రత్యక్షఉదాహరణమీకువివరిస్తున్నాను. 

కొన్నిసంవత్సరాలక్రితంజరిగినసంఘటన.

ఒకసారిమాకుబాగాకావలసినదంపతులిరువురుమాఇంటికివచ్చారు. మేముఆస్పత్రికిఅత్యవసరంగావెళ్లవలసివచ్చింది. సమయంలోవంటచేయడానికిపరిస్థితులుఅనుకూలించనందువల్లప్రక్కనేఉన్నఇంటివారుదంపతులిద్దరినిభోజనానికిపిలిచారు. ( ఆస్పత్రినుండివచ్చినతరువాతమేముకూడావారింటిలోభోజనంచేసాము.)  అప్పుడుఇంటిలోగృహయజమానిభార్య, ఆమెతండ్రిఉన్నారు.  గృహయజమానిబయటకువెళ్లిఉండవచ్చు.  దంపతులుభోజనంచేస్తూఉండగా,  గృహయజమానియొక్కభార్య, ఆమెతండ్రిఅన్నమాటలు..” అసలుమేముమీకుభోజనంఎందుకుపెట్టాలండీ, మాకేమిఅవసరంఅనిఇష్టంవచ్చినట్లుగాతృణీకారభావంతోఎన్నోమాటలుఅనడంజరిగింది.  ఆవిధంగాఅనడానికిగలకారణంమాత్రంతెలియదు. మాకుమాపొరుగువారితోఎటువంటిఅభిప్రాయభేదాలులేవు. దంపతులనుభోజనానికితమంతటతామేఆహ్వానించి పరబ్రహ్మస్వరూపమయినఅన్నమునువడ్డించిఅతిధులనునిరాదించడంవల్లఅన్నమునుఅనగాపరబ్రహ్మమునుఅవహేళనచేసినట్లేననిభావించవచ్చు.  దంపతులిద్దరూమౌనంగాభోజనంముగించారు. విధంగాజరిగినవిషయంనాకుచాలాకాలంతరవాతతెలిసింది.  దానిఫలితంగాగృహయజమానికిభార్యావియోగంకలిగిఆదరంతోఅన్నంతినేభాగ్యంకలుగలేదు.  ధనంఉండవచ్చుగాక, హోటల్లోతినేయోగంపట్టిందంటేఆదరంకరువవబట్టేకదా.
అందువల్లఉపనిషత్లలోను, వేదాలలోనుమనకువిధించినధర్మాలనుమనంఆచరించేతీరాలి.  గృహస్థుమంచినడవడిక, ధర్మాలనుఆచరిస్తూ ధర్మ సూత్రాలనుపాటించినట్లయితేకుటుంబంలోనివారుకూడాఅతనిఅడుగుజాడలలోనడుస్తారు.  యజమానేధర్మంతప్పినట్లయితేభార్యా, పిల్లలుకూడాఅదేదారిలోనడుస్తారు.
(రేపటినుండి సాయిబానిసగారి సాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలు ప్రారంభం)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)






శ్రీసాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు - 1 వ.భాగమ్

$
0
0
   Dattatreya Sai | Sai baba pictures, Sai baba, Sai baba photos

     White Rose Wallpapers - Top Free White Rose Backgrounds ...
05.07.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు మరియు
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
ఈ రోజునుండి బాబాగారు సాయిబానిస గారికి ప్రసాదించిన  ‘శ్రీసాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలను’ సాయి భక్తులందరికి అందజేస్తున్నాను.
శ్రీసాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు - 1 వ.భాగమ్
-   
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
-       సాయిదర్బార్హైదరాబాద్
ముందుమాట
నాపేరు శ్రీమతి రావాడ మధుగోపాల్.  నాభర్త సాయిబానిస రావాడ గోపాలరావుగారు కంటిచూపు మందగించటంతో ఇంటికే పరిమితము అయి సాయిదర్బార్ పనులునుండి 30.01.2020 నుండి పూర్తి విశ్రాంతి తీసుకోసాగారు.  12.02.2020 నాడు శ్రీసాయి వారికి సాయి సాగరమునుండి వెలికి తీసిన ఆణిముత్యాలను  గంపనిండా పోసి చ్చారు. గంపనిండా ఉన్న ముత్యాలను రోజు ఒక ముత్యాన్ని రాత్రి నిద్రించేముందు తన శిరస్సుపై పెట్టుకొని నిద్రించమన్నారు.



ఇది వారికి శ్రీసాయి కలలో చ్చి ఆదేశము.  నా భర్త నాకు ఈవిషయము తెలియచేసి 13.02.2020 నుండి బాబా ఇచ్చే ఆధ్యాత్మిక సందేశాలను శ్రీసాయి సాగరమునుండి వెలికి తీసిన ఆణిముత్యాలను ఒక మాలగా (ఒక పుస్తకరూపంలోకూర్చమని కోరారు.  నేను నా భర్త ఆదేశానుసారము 13.02.2020 నుండి బాబావారు నా భర్తకు ఇచ్చే సందేశాలను శ్రీసాయి భక్తులకు తెలియచేస్తాను
శ్రీ సాయి సేవలో
శ్రీమతి మధుగోపాల్

13.02.2020  కుతుబ్ (QUTUB) అని నామకరణం.
నేను (సాయిబానిసహైదరాబాద్ నగరము బయట ఉన్న ఒక పల్లెటూరిలో ఉన్న ఒక ముస్లిమ్  ఫకీరు దర్గా దగ్గర తిరగసాగాను.   దర్గా ప్రక్కన ఒక రాతితో చేయబడిన ఒంటి స్తంభము ఆకాశములోనికి చాలా ఎత్తుగా నిలబడి ఉంది.   స్తంభము చూడగానే నాకు కుతుబ్ మీనార్ గుర్తుకు వచ్చినది.   స్తంభానికి ఎక్కడానికి మెట్లు స్తంభము చుట్టూ ఉన్నాయి.   స్తంభమును చూస్తూ ఉంటే ఒక ఫకిరు వచ్చి నీవు స్తంభము ఎక్కగలిగిన నిన్ను నేను కుతుబ్ అని పిలుస్తాను అన్నారు.  నేను  ఫకీరు ఆశీర్వచనాలతో  స్తంభము చుట్టు ఉన్న మెట్లను మెల్లిగా ఎక్కసాగాను.  
       Quṭb Mīnār | minaret, Delhi, India | Britannica
ఆఖరికి స్తంభము చివరకు చేరుకొన్నాను.  అక్కడినుండి క్రింద ఉన్న ఫకీరును చూసాను.  నాకు భయము వేసి నేను స్తంభము దిగిపోతాను అన్నాను.   ఫకీరు ఒకసారి నావైపు చూసి, నీవు ఆధ్యాత్మిక కుతుబ్ మీనార్ క్కావు.  ఒకసారి పైకి ఎక్కిన తిరిగి క్రిందకు దిగరాదు.  నీకు ఇంకా ప్రాపంచిక రంగములో ఆశ పూర్తిగా పోలేదు.  నీవు స్తంభము చివరనే నిలబడు.  నేను నా శక్తితో ఆమీనార్ ను వంగేలాగ చేస్తాను.  నీవు ఆసమయంలో మీనార్ పైనుండి దగ్గరలోని శివాలయాల పైకి దూకివేయి.  నీవు సురక్షితముగా ఆమందిరములోనికి చేరుకొంటావు అన్నారు.

ఇంతలో పెద్ద సుడిగాలి వీచసాగింది.  నేను  మీనార్ చివరి రాతి పలకను గట్టిగా పట్టుకొని ఉన్నాను.  గాలివేగానికి నాబట్టలు ఎగిరిపోయాయి.  నేను నగ్నముగా ఆమీనార్ పై భాగములోనే నిలబడి ఉన్నాను.  ఇంతలో  మీనార్ మెల్లిగా వంగసాగింది.   మీనార్ పైనుండి దగ్గరలోని శివాలయం పై భాగానికి దూకివేసాను.

ఆశివాలయం పై భాగమునుండి క్రిందకు దూకి అక్కడకు ధర్శనానికి వచ్చిన భక్తులతోపాటు మందిరములోనికి పరమశివుని దర్శనానికి వెళ్ళసాగాను.  ఆవరసలో మరణించిన నా తమ్ముడు ఉన్నాడు.  అతను నన్ను గుర్తు పట్టలేదు.  అతను నన్ను చూసి మీరు నగ్నముగా ఈమందిరములోనికి రాకూడదు అని తన వద్ద ఉన్న శాలువాను నాపై ప్పాడు.  నేను నాతమ్మునికి మనసులో కృతజ్ఞతలు చెప్పాను.  అతను నాకు షిరిడీనుండి తెచ్చిన ఊదీ పొట్లాలు ఇచ్చాడు.  నేను ఆపొట్లాలను చించి అక్కడ ఉన్న శివలింగము మీదగణపతిదుర్గామాతమరియు దత్తాత్రేయస్వామిల విగ్రహాలపై చల్లాను.  ఇంతలో అక్కడకు మరణించిన నాతల్లి వచ్చి నాచేతిలో హారతి కర్పూరము పెట్టి వెలిగించి గోడమీద శ్రీషిరిడీసాయి పటానికి హారతి ఇప్పించింది.  ఆమె నన్ను గుర్తు పట్టలేదు.  నాచేయి కాలలేదు.  నేను శ్రీషిరిడీసాయికి హారతి ఇచ్చి బయటకు వచ్చాను.  మందిరము బయట వాన పడసాగింది.  నేను వానలో తడుస్తూ ముందుకు వెళ్లసాగాను.

 వానలో నాముందు దర్గా దగ్గర కనిపించిన ఫకిరు దర్శనము ఇచ్చి నన్ను ప్రేమతో (కుతుబ్అని పిలిచి తనవద్దనున్న ఒక పాత కఫనీ నాశరీరముపై ధరింపచేసాడు.  నీవు ఈరోజునుండి మరణించేవరకు కుతుబ్ గా పిలవబడతావు.  అంతవరకు ఈప్రాపంచిక రంగములో భగవంతుని నామమును స్మరించుతు జీవించి అన్నారు.
విశ్లేషణ.
సూఫీ తత్త్వములో భగవంతుని గొప్పతనము మరియు భగవత్ తత్త్వమును మానవాళికి తెలియచేసే వ్యక్తులను కుతుబ్ అని పిలుస్తారు.  మన సనాతన ధర్మములో కుతుబ్ అనే మాటకు అర్ధము మునీశ్వరుడు అని గ్రహించగలరు.


సాయిబానిస.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు - 1వ.భాగమ్

$
0
0

     Sai Baba Of Shirdi - A Blog: Sai Baba blessed me with His grace ...         100+ Rose Images | Download Rose Images in HD For Free - Az-Quotes08.07.2020  బుధవారమ్
ఓమ్సాయిశ్రీసాయిజయజయసాయి
సాయిబంధువులకుబాబావారిశుభాశీస్సులు
రోజుఒకఆసక్తికరమయినఅంశాన్నిమీకుఅందచేస్తున్నాను.  బాబాఎవరినీతనశిష్యులుగాచేసుకోలేదు,  ఆయనకువారసులుకూడాలేరు.  దీనికి సంబంధించిన వ్యాసమ్ shirdisaisevatrust.orgచెన్నైవారినుండిగ్రహింపబడినది.
(సాయిలీలపత్రికనవంబరు, డిసెంబరు 1983 సంచికలోపునర్ముద్రితం.)
తెలుగుఅనువాదం --  ఆత్రేయపురపుత్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
ఫోన్.  9440375411 , 8143626744
( ఈ వ్యాసాన్ని shirdisaisevatrust.org నుండి యధాతధంగా అనువాదం చేసి ప్రచురిస్తున్నాను. అందువల్ల ఇందులో తెలియపరచబడిన అభిప్రాయాలన్నీ శ్రీ శంకరయ్యగారివేనని గ్రహించవలెను.)

సాయిబాబాకువారసులుగానిశిష్యులుగానిలేరు -1 వ.భాగమ్
(రచయితకీ.శే. డి. శంకరయ్య)
27.02.1983 లోనేనుషిరిడీలోనిసాయిసంస్థానంఆఫీసులోఒకప్రకటననిచూడటంతటస్థించింది.  ప్రకటనలోవిధంగావ్రాసిఉంది.  సాయిబాబాకువారసులుగాని, శిష్యులుగానిలేరు”(Saibaba left no heir or disciple).
ప్రకటనగురించినేనుసమాధిమందిరంలోను, ద్వారకామాయిలోనుచావడిలోనుకూర్చునిపదేపదేఆలోచించాను.  ఆవిషయంగురించేచాలాతీవ్రంగాఆలోచించగావచ్చినసమాధానమేఇపుడునేనుమీకువివరించబోతున్నది.



నేడుమనభారతదేశంలోబాబాలకు, స్వామీజీలకిగురువులకిఎటువంటిలోటులేదు.  సాయిబాబాపేరుచెప్పుకునిసంచరిస్తూఎన్నోపనులుచేస్తున్నబాబాలగురించేఇపుడుచర్చించుకుందాము.  అసలుసాయిబాబాకుజననమరణాలులేవు.  ఆయనఎప్పటికీసజీవులే.  అటువంటిదికొంతమందిబాబాలుతామేసాయిబాబాఅవతారమనిచెప్పుకుంటూఉంటారు.  కొంతమందిసాయిబాబాతమకుకొన్నిశక్తులుఇచ్చారని కూడా చెప్పుకుంటు ఉంటారు.  సాయిబాబాతనభక్తులలోఉన్నటువంటిప్రగాఢమయినభక్తినిబట్టి, వారిలోఉన్ననమ్మకాన్నిబట్టి, భక్తులందరినిఅనుగ్రహిస్తారనిఅనడంలోఎటువంటిసందేహంలేదు.  ఆవిధంగాబాబానిసరిగాఅర్ధంచేసుకునిఆయనయందేతమనమ్మకాన్నినిలుపుకున్నభక్తులపైబాబాకృపఎల్లప్పుడూఉంటుంది.  ఎటువంటిఆర్భాటాలు ప్రచారాలులేకుండానిశ్శబ్దంగాసాయిసేవచేసినఎంతోమందిభక్తులకునిగూఢంగాఆధ్యాత్మికోన్నతినికలిగించారు.

సంపూర్ణమయినశక్తిఅంతాబాబాసమాధిలోనేఉంది.  శక్తిప్రసారానికికేంద్రస్థానమయినబాబామహాసమాధినుండే ఆయన శక్తిప్రవహిస్తూఉంటుంది.  బాబాఅవరాతాలమనిచెప్పుకునేవారుయదార్ధమయినవిషయాన్నిగ్రహించలేనిస్థితిలోఉన్నారంటేవారినిఅంధులుగానేపరిగణించాలి.  బాబాసమాధినుండిశక్తిప్రవహిస్తున్నంతవరకుబాబాలందరుతమఇష్టానుసారంఉపయోగించుకుంటూఉంటారు.  ఎప్పుడయితేఆశక్తిప్రసారంనిలిచిపోతుందోబాబాలబండారంప్రజలముందుబయటపడిపోతుంది.  అప్పుడువారిపరిస్థితిఒడ్డునపడ్డచేపల్లాగఉంటుంది.  దానికికారణంసాయిబాబావారుప్రసాదించినఅనుగ్రహాన్నితమస్వార్ధప్రయోజనాలకోసందుర్వినియోగంచేసుకోవడమే.  సాయికిఅమూల్యమైనసేవలుచేస్తున్నఎంతోమందిభక్తులుఉన్నారు.  యదార్ధమయినశక్తిబాబామాత్రమేఅనిగ్రహించుకున్నకొంతమందిబాబాలుభక్తులనుఎంతోవినయంగాషిరిడీకిమాత్రమేపంపిస్తున్నారు.
        Shirdi Sai Baba: The Wise Indian Saint | Indian saints, Sai baba ...
ఖండోబాదేవాలయంవద్దపెండ్లివారిబృందంతోకలిసివస్తున్నఒకయువఫకీరునుమొట్టమొదటిసారిచూసినవెంటనేమహల్సాపతి (తరువాతబాబాకుఅంకితభక్తుడయాడు) అసంకల్పితంగాఆవోసాయిఅనిసంబోధించాడు.  అప్పటినుండిఆయువఫకీరుసాయిగాప్రసిధ్ధిచెందాడు.  ఇపుడుకొంతమందిబాబాలు, తమతల్లిదండ్రులుపెట్టినపేర్లకుముందుగాని, చివరగాని. ‘సాయిఅనేపదాన్నిచేర్చుకుంటున్నారు.  వారుస్వంతంగాతమపేర్లుముందు,చివరసాయిఅనిచేర్చుకోవడాన్నినేనుతప్పుపట్టడంలేదు.  కానివారుతమకుతామేసాయిఅవతారములనిచెప్పుకోవడంతప్పు.  రామఅనేపేరుగలవ్యక్తిఉన్నట్టేపదిఅవతారాలలోరామఅనేపదంఉంటుంది.
నేటిసాయిఅవతారాలమనిచెప్పుకునేవారుతమపేర్లనుఅవతారంలోఎందుకనిమార్చుకోలేదోఅర్ధంకాదు.  శ్రీసాయిసత్చరిత్రపేజీ 236 (8 .ముద్రణ) సాయిబాబాతానుసమయంవచ్చినపుడు 8 ఏండ్లబాలునిగావస్తాననికొంతమందిభక్తులతోచెప్పారు.  (8 సంవత్సరాలతరువాతఅనిభావించవద్దు).  బాబానమ్మకంగాచెప్పినఆమాటనికొంతమందిబాబాలువక్రీకరించిచెప్పడం, కొంతమందిఅమాయకులైనభక్తులనుఆవిధంగానమ్మించారు.  సాయిబాబా8 సంవత్సరాలతరువాతవస్తాననితనభక్తులతోచెప్పారనివక్రభాష్యంచెప్పారు.  బాబా1918.సంవత్సరంలోమహాసమాధిచెందారు. తరువాత 1926 లోజన్మించినవారుతామేసాయిఅవతారాలమనినమ్మించారు.  బాబాఇచ్చినమాటనిఆవిధంగావక్రీకరించిచెప్పడంఎంతహాస్యాస్పదం?

బాబామహాసమాధిచెందకముందుఆయనచెప్పినసూత్రాలనుబాబాలమనిచెప్పుకునేవాళ్ళు, వారిశిష్యులుఅర్ధంచేసుకోలేనంతఅజ్ఞానులా?  భౌతికదేహానంతరముసైతమునేనప్రమత్తుడనే, నాసమాధినుండెనేనన్నికార్యములనునిర్వహిస్తాను.   నన్నాశ్రయించువారిని, నన్నుశరణుజొచ్చినవానినినిరంతరమురక్షించుటయేనాకర్తవ్యము.”

ఒకవేళబాబాఅంతతక్కువవ్యవధిలోఎనిమిదిసంవత్సరాలతరువాతమరలాప్రకటితమవుతాననేకనకచెప్పిఉంటేబాబాతనభక్తులకుఅటువంటి  అభయప్రదానమయినమాటలనుఅన్నిచెప్పిఉండేవారుకాదు. 
బాబాతనసమాధికిఇచ్చినఅత్యంతప్రాముఖ్యతనుఅర్ధంచేసుకోగలిగితేఎవ్వరూకూడాతాముబాబాఅవతారాలమనిచెప్పుకునేవారినిఎప్పుడూనమ్మరు.
(ఇంకా ఉంది)
(రేపటి సంచికలో ఆణి ముత్యాలు 2 వ.భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 2 వ.భాగమ్

$
0
0

     SaiBaba The Master: Shyamdas and his Sai experience during sea voyage
          White Rose PNG Deco Image | Gallery Yopriceville - High-Quality ...
09.07.2020  గురువారమ్
ఓమ్సాయిశ్రీసాయిజయజయసాయి
సాయిబంధువులకుబాబావారిశుభాశీస్సులు
శ్రీసాయిసాగరంనుండివెలికితీసినఆణిముత్యాలు  2 .భాగమ్
-      సాయిబానిస
-       సంకలనంమరియుకూర్పుశ్రీమతిరావాడమధుగోపాల్
-       సమర్పణఆత్రేయపురపుత్యాగరాజు
-       సాయిదర్బార్, హైదరాబాద్
14.02.2020  అన్నదానము
నిన్నటిరోజునుండినిన్నునేనునాదర్బారులోకుతుబ్గానియమించాను.  ఇకప్రతిరోజునీవుచేయవలసినపనులనునీకుతెలియచేస్తాను.  రోజుననీవుఅన్నదానముయొక్కప్రాముఖ్యతనుగుర్తించినీవుభగవంతునికృపకుపాత్రుడవికాగలవు.


అన్నముపరబ్రహ్మస్వరూపం.  నీవుభోజనముచేసేముందుభగవంతునికిఅన్నమునునైవేద్యముగాపెట్టిఆతరువాతనేఅన్నమునునీవుభుజించు.  
         Annadanam - The sacred tradition of offering food | Get Involved
నీవుఆకలితోఉన్నపుడునీవుభోజనముచేస్తావు.  అదేఆకలినీతోటివానిలోను, నీప్రక్కనఉన్నమూగజీవులలోనుఉంటుందిఅనిగ్రహించివాటికికూడానీతోపాటుభోజనంపెట్టడమేఅన్నదానము.  అన్నదానముబీదవారికేచేయాలిఅనేభావనరానీయకు.  నీవుభోజనముచేసేసమయంలోఒకధనికుడుఆకలితోనీఇంటికివచ్చిభోజనముపెట్టమనికోరినవానికికడుపునిండాభోజనముపెట్టు. 

వానిఆకలినితీర్చినతర్వాతవానినుండిఏమీఆశించకు.  భగవంతుడుధనవంతునిరూపంలోనీఇంటఅన్నదానముస్వీకరించినారని  భావించు.
ఈనాడువివాహాదిశుభకార్యాలలోవచ్చినఅతిధులకుపిండివంటలతోభోజనముపెడుతున్నారు.  ఆవచ్చినఅందరుతినేదితక్కువఆఖరులోవిస్తర్లలోపారవేసేదిఎక్కువ.  
          Are You Wasting Food? Some Tips To Avoid Wastage Of Food
ఇదినాకుచాలాబాధనుకలిగించుచున్నది.  నీవువారలకుమొహమాటములేకుండతినగలిగేవంటకాలనేతినమనిచెప్పు. నీఇంటమిగిలినపిండివంటలనుఅనాధలకు, బీదవారికిపంచిపెట్టు.  అదేనిజమైనఅన్నదానముఅనిగ్రహించు.

ఇకనేటిసాయిమందిరాలలోఅన్నదానమువ్యాపారసరళిలోజరుగుతున్నది.  ఇదినాకుచాలాబాధకలిగించుతున్నది.  అన్నదానముచేయదలచినవ్యక్తిఅన్నదానముసమయంలోవచ్చితనస్వహస్తాలతోఆకలితోఉన్నవారికిఅన్నముపెట్టిననేనుకూడవారితోపాటుసహబంతిలోకూర్చొనిభోజనముచేసిఅన్నదానమునుఆశీర్వదించుతాను.
విశ్లేషణ
1992 .సంవత్సరంశీతాకాలమురాత్రిపదిగంటలసమయంలోఒకవృధ్ధుడునాఇంటిగుమ్మమువద్దకువచ్చితనదిదగ్గరలోనిఒకపల్లెటూరుఅనితనువెళ్లవలసినబస్సువెళ్లిపోయినదని, రేపుఉదయంవరకుబస్సులేదు, పూటమీఇంటభోజనముతప్పకదొరుకుతుందిఅనేనమ్మకముతోవచ్చాను, నాకుఆకలిగాఉందిమీరుతినగామిగిలినఅన్నము, కూరనాకుపెట్టినసంతోషముగాతినివెళ్ళిపోతానుఅనిచెప్పడమునాకుఆశ్చర్యముకలిగించింది.

నేనువంటఇంటిలోచూడగాఅన్నముకూరమాత్రమేఉంది.  నేనువృధ్ధునికిఒకవిస్తరాకులోఅన్నము, కూరమరియుమామిడికాయఊరగాయపెట్టాను.  వృధ్ధుడునాఇంటిఅరుగుమీదకూర్చొనికడుపునిండాతినిమంచినీరుత్రాగిమమ్ములనుఆశీర్వదించివెళ్ళిపోయాడు.  తెల్లవారుజాముననాభర్తకుకలలోబాబాదర్శనముఇచ్చినిన్నరాత్రినీభార్యపెట్టినఅన్నము, కూరచాలారుచిగాఉన్నది, కడుపునిండాతినితిరిగిషిరిడీకివెళ్ళిపోయానుఅన్నమాటలనువిన్ననేనుచాలాసంతోషించాను.
శ్రీమతిమధుగోపాల్
15.02.2020 సన్యాసాశ్రమము
ఆధ్యాత్మికరంగములోపయనించేవారుఆఖరులోసన్యాసాశ్రమముస్వీకరించవలసిఉండును.  సన్యాసికిదేహముమీదవ్యామోహము, బంధువులమీదవ్యామోహము, ధనముమీదవ్యామోహముఉండరాదు.  నిజమైనసన్యాసిసమాజములోకీర్తిప్రతిష్టలకుపొంగిపోరాదు.  అలాగేకష్టాలకుకృంగిపోరాదు.  సదాభగవంతునిధ్యానించుతూసమాజ శ్రేయస్సుకుపాటుపడుతూభిక్షాటనపైజీవించాలి.
విశ్లేషణ.
శ్రీసాయిసత్చరిత్రచదివినప్రతివారికిసన్యాసివిజయానందునికధగుర్తుకువస్తుంది.  అతడుమద్రాసునుండిమానససరోవరయాత్రకుబయలుదేరియాత్రచాలాకష్టతరమైనదనిశరీరవ్యామోహముతోషిరిడీచేరుకొనిబాబాదర్శనముచేసుకొనెను.  అతడుకాషాయవస్త్రాలుధరించితనతల్లిపైమమకారమునువదులుకోలేకుండెను.  బాబావానినిపిలిచిశరీరముమీదవ్యామోహముతల్లిమీదమమకారమువదలిపెట్టమనిసలహాఇచ్చెను.  అతనుబాబాఆదేశానుసారముభాగవతముపారాయణచేసిబడేబాబాఒడిలోతలపెట్టుకునిమరణించెను.
సాయిబానిస.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు – 2 వ.భాగమ్

$
0
0

        Shirdi Sai baba: Images of Shirdi Saibaba
    White Rose Wallpapers - Top Free White Rose Backgrounds ...

10.07.2020  శుక్రవారమ్
ఓమ్సాయిశ్రీసాయిజయజయసాయి
సాయిబంధువులకుబాబావారిశుభాశీస్సులు
రోజుఒకఆసక్తికరమయినఅంశాన్నిమీకుఅందచేస్తున్నాను.  బాబాఎవరినీతనశిష్యులుగాచేసుకోలేదు,  ఆయనకువారసులుకూడాలేరు.  సమాచారమ్shirdisaisevatrust.org చెన్నైవారినుండిగ్రహింపబడినది.
(సాయిలీలపత్రికనవంబరు, డిసెంబరు 1983 సంచికలోపునర్ముద్రితం.)
తెలుగుఅనువాదం --  ఆత్రేయపురపుత్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
ఫోన్.  9440375411 , 8143626744
సాయిబాబాకువారసులుగానిశిష్యులుగానిలేరు – 2 వ.భాగమ్
(రచయితకీ.శే. డి. శంకరయ్య)
( ఈ వ్యాసాన్ని shirdisaisevatrust.org నుండి యధాతధంగా అనువాదం చేసి ప్రచురిస్తున్నాను. అందువల్ల ఇందులో తెలియపరచబడిన అభిప్రాయాలన్నీ శ్రీ శంకరయ్యగారివేనని గ్రహించవలెను.)

సమాధిమందిరం కట్టబడిన ఈనాటి ప్రదేశం, ఒకప్పుడు బాబా పూలతోటను పెంచిన ప్రదేశమని మనందరకూ తెలుసు.  సమాధిమందిరం కట్టబడటానికి దశాబ్దాల క్రితమే బాబా మొక్కలను నాటి వాటికి నీరుతోడి పోసేవారు.  బాబా ఆవిధంగా ఆప్రదేశాన్ని శుధ్ధిచేసి పావనం చేసారు.


నాగపూర్ నివాసి అయిన బూటీ మురళీధరుని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అక్కడ ఒక మందిరాన్ని నిర్మించాడు.  అంతా పూర్తయిన తరువాత మురళీధరుని స్థానంలో బాబా ప్రవేశించారు.  ఈవిధంగా ఎందుకు జరిగింది అన్నదాని గురించి మనం తీవ్రంగా  ఆలోచిద్దాము.  బాబాలాంటి యోగీశ్వరులకి మరణంలేదని, వారు కూడా మానవులలాగానే కనిపించినా యదార్ధానికి వారు స్వయంగా భగవంతుడేనని మనందరికి తెలుసు (సత్ చరిత్ర పేజీ 239).  మరణంలేని మంత్రాలయ రాఘవేంద్రస్వామీజీ కూడా తన సమాధి 700 సంవత్సరాలపాటు శక్తివంతంగా ఉంటుందని ప్రకటించారు.  అదే విధంగా బాబా సమాధికూడా శక్తివంతంగా ఉంటుంది.
         Akkaraipatti Shirdi Sai Baba's 99th Samadhi Day
ఒక సత్పురుషుడు ఒక ప్రదేశంలో నివశిస్తున్నాడంటే ఆయనను దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు.  కాని ఆ మహాపురుషుడు భౌతికంగా దూరమయిన తరువాత క్రమక్రమంగా ఆప్రదేశానికి అంతకు ముందు ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తుంది.  చరిత్రపుటలను తిరగేస్తే  అటువంటి ప్రదేశాలగురించిన వివరాలను మనం గమనించవచ్చు.  కాని, షిరిడీ మాత్రం అటువంటిదానికి అతీతం.  మొత్తం షిరిడీ స్వరూపమే మారిపోయింది.  1918 వ.సంవత్సరం తరువాత రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా అనేక సాయిమందిరాలు వెలిసాయి.  సాయిసమాజాలు ఏర్పాటయ్యాయి.  బాబా సశరీరంగా ఉన్నప్పటికంటే ఈనాడు బాబా మరింతగా జీవించి ఉన్నారనే విషయానికి తగిన ఋజువు లభించినట్లే కదా.

బాబా తమ దేహాన్ని విఢిచిన వెంటనే ఏమి జరిగిందో చూద్దాము.  ఆయన పార్ధివదేహాన్ని ఏమిచేయాలన్న సమస్య వచ్చింది.  ఆయన శరీరం 36 గంటలయినా సరే బిగుసుకుపోలేదు.  కాళ్ళు, చేతులు అన్నీ యధాస్థితిలోనే అటూ ఇటూ కదల్చగలిగిన స్థితిలోనే ఉన్నాయి.  ఆయన ధరించిన కఫనీని ముక్కలుగా చింపకుండానే తీయగలిగారు.  శ్రీసాయి సత్ చరిత్ర గ్రంధకర్త బాబా గురించి సమయోచితంగా “సచ్చీలత కలవాడు, పంచేంద్రియాలను, మనస్సుని అదుపులో ఉంఛకున్నవాడు, పరిపాలకుడు” అని సాయిని వర్ణించాడు.

“ఎల్లప్పుడు నానిరాకార స్వరూపాన్నే ధ్యానించమని బాబా తన భక్తులకు బోధించారు.  అందువల్ల బాబా మూడున్నర మూరల దేహం మాత్రమే కాదు. ఆయన సర్వాంతర్యామి.

16.10.1918 వేకువజామున బాబా, లక్ష్మణ్ మామా స్వప్నంలో కనిపించి “త్వరగా లే, నేను మరణించాననుకుని బాపూసాహెబ్ జోగ్ ఈ రోజు రాడు.  నువ్వయినా వచ్చి నాపూజ చేసి కాకడ ఆరతి ఇవ్వు” అన్నారు.  జోషి బాబా ఆదేశించిన ప్రకారం ఎప్పటిలాగానే బాబాకు పూజచేసి ఆరతి ఇచ్చాడు.  తన శరీర స్థితి ఎలా ఉన్నాగాని, భక్తులమనసులలో  ఉన్న సంధిగ్ధాన్ని తొలగించడానికి తనకు ప్రతిరోజు జరుపబడే పూజ, ఆరతులను యధావిధిగా నిర్వహించేలా బాబా ఏర్పాటు చేసారు.  16.10.1918 న పండరీపూర్ లో ఉన్న దాసగణు మహరాజ్ స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, “మసీదు కూలిపోయింది, నాశరీరాన్ని పూలతో కప్పు” అని చెప్పారు.  దాసగణు ఆవిధంగానే ఆయన సమాధిని పూలతో కప్పాడు.

శ్రీబి.వి.నరసింహస్వామి గారు రచించిన Devotees Experiences అనే పుస్తకంలో శ్రీ M.W. ప్రధాన్ గారు చెప్పిన విషయం…

“18.10.1918 నాడు బాబా దేహాన్ని వీడివెడుతున్న స్థితిలో తనకు స్వప్నంలో కనిపించి “ప్రజలంతా మహాత్ములు మరణించారు అని అంటారు, కాని మహాత్ములు సమాధి చెందారని అనాలి” అని బాబా చెప్పారు.

మరలా 19.10.1918 నాడు స్వప్నంలో దర్శనమిచ్చి మూడు రూపాయలు ఇచ్చారు.  ఆవిధంగా స్వప్నంలో డబ్బు తీసుకోవడం మంగళప్రదం కాదని భావించి నేను తిరస్కరించగా బాబా “దీనిని తీసుకుని నీపెట్టెలో నువ్వు దాచిన డబ్బుతో సహా నాకివ్వు” అన్నారు.  అదేరోజు రాత్రి బాబా ప్రధాన్ మరదలి కలలో కనిపించి తన సమాధిని పసుపురంగు పీతాంబరంతో కప్పమని చెప్పారు.  ఈవిషయాలన్నిటినీ ప్రధాన్ గారు వివరించారు.  ఈసంఘటలన్నిటినీ గమనిస్తే బాబా ఇంకా సజీవులేనని మనకు అర్ధమవటల్లేదా?  అవతారాల గురించిన ప్రసక్తి ఇక అనవసరం.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు – 3 వ.భాగమ్

$
0
0

      Wrestling between Mohiuddin and Sai Baba
          Nelesa Gardening Live Grafted White Rose Plant in Pot: Amazon.in ...
11.07.2020  శనివారమ్
ఓమ్సాయిశ్రీసాయిజయజయసాయి
సాయిబంధువులకుబాబావారిశుభాశీస్సులు

 బాబాఎవరినీతనశిష్యులుగాచేసుకోలేదుఆయనకువారసులుకూడాలేరుసమాచారమ్shirdisaisevatrust.orgచెన్నైవారినుండిగ్రహింపబడినది.
(సాయిలీలపత్రికనవంబరు, డిసెంబరు 1983 సంచికలోపునర్ముద్రితం.)
తెలుగుఅనువాదం --  ఆత్రేయపురపుత్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
ఫోన్.  9440375411 , 8143626744

సాయిబాబాకువారసులుగానిశిష్యులుగానిలేరు– 3 .భాగమ్
(రచయితకీ.శే. డి. శంకరయ్య)
( ఈ వ్యాసాన్ని shirdisaisevatrust.org నుండి యధాతధంగా అనువాదం చేసి ప్రచురిస్తున్నాను. అందువల్ల ఇందులో తెలియపరచబడిన అభిప్రాయాలన్నీ శ్రీ శంకరయ్యగారివేనని గ్రహించవలెను.)


బాబాఒకఫకిరులాగప్రతిరోజుఅయిదారిండ్లలోభిక్షస్వీకరించిజీవించారు.  అన్నం, కూరలవంటివాటినిజోలెలోవేయించుకుని, ద్రపదార్ధాలనుఒకతంబిరేలుడబ్బాలోపోయించుకునేవారు.  వాటినన్నిటినిఒకకొళంబాలోవేసిఉంచేవారు.  పిల్లులు, కుక్కలు, కాకులుఅందులోనిపదార్ధాలనుయధేచ్చగాతింటూఉండేవి.  ఆయనవేటినీతరిమివేసేవారుకాదు.



       
   Saibaba The Master - Saibharadwaja.org
బాబాకోరితేఎన్నోమధురపదార్ధాలనుఇవ్వడానికి భక్తులెందరోఉన్నాగాని, బాబాతనుభిక్షద్వారాస్వీకరించినదానినేఎక్కువగాఇష్టపడేవారు.  ఆయనసాంప్రదాయాన్నితనుమహాసమాధిచెందేవరకుఆచరించారు.  ఇపుడుతాముసాయిఅవతారాలమనిచెప్పుకుతిరిగేవారుగాని, వారిశిష్యులుగాని, తమఆహారంకోసంబాబాఆచరించినట్లుగాఆచరిస్తున్నారా?  భిక్షద్వారాస్వీకరించినఆహారాన్నికాకాపోయినాకనీసంజంతువులుముట్టినఆహారాన్నయినావారుస్వీకరిస్తారాఅనినాఅనుమానం.  బాబాశయనించేపధ్ధతికూడాఎంతసామాన్యంగాఉంటుందోగమనించండి.  ఆయననాలుగుమూరలపొడవు, ఒకజానెడువెడల్పుగలచెక్కబల్లపైనేపడుకునేవారు.  మసీదుదూలాలకిచినిగినపాతగుడ్డలపీలికలతోదానినికట్టి, దానిపైపడుకొనేవారు.  బల్లనాలుగుమూలలందునాలుగుదీపపుప్రమిదలుఉంచేవారు.  బాబాబల్లపైకిఎలాఎక్కేవారోఎలాదిగేవారోఎవరికీతెలియదు.  బాబాకాకాసాహెబ్తోఎవరయితేకండ్లుతెరచినిద్రించగలరోవారేఆవిధముగాచేయగలరుఅన్నారు.  ఆవింతచూడటానికిభక్తులంతాగుమిగూడివస్తూండటంతోబాబాఆబల్లనువిరిచిపారేశారు.  ఇపుడుసాయిఅవతారాలమనిచెప్పుకొనేవారుకనీసంమెత్తనిపరుపులమీదనయినాకండ్లుతెరచుకొనినిద్రించగలరా?
                         videos
బాబాఏనాడూకాషాయవస్త్రాలకిమొగ్గుచూపలేదు.  ఆయనతెల్లటిదుస్తులనేధరించేవారు.  ఈనాటిబాబాలుసిల్కుకాషాయాంబరాలనుధరిస్తున్నారు.  బహుశవారుతాముబాహ్యంగా ఒక బాబాలాగగుర్తింపుపొందాలనేభావనతోఅయిఉండవచ్చు.  అందువల్లనేకనిపించేశరీరంకాదుయోగిలాగఉండవలసినది, మానసికంగాఒకయోగిలాగఉండాలనిఒకనానుడి.  బాబాకుఅణిమాదిఅష్టసిధ్దులూఅన్నీవచ్చు.  యోగాభ్యాసికూడా .  కానిఆయనవాటినెపుడుతనగొప్పతనాన్నిచూపించడంకోసంగాని, ప్రజలనుఆకర్షించడానికిగానిఉపయోగించలేదు.  ఆయనతనప్రేగులనుబయటకుతీసుశుభ్రపరచిచెట్టుకిఆరబెట్టేవారు.  ఖండయోగంచేసేవారు.  ఈవిధంగాఆయనతనశరీరాన్నిశుధ్ధిచేసుకొనేవారు.  ఇపుడుచాలామందిబాబాలురోజ్వాటర్తోస్నానంచేస్తూతమశరీరాలనుశుభ్రపరచుకొంటున్నారు.

ధ్యానం, జపతపాలుచేసినట్లయితేభగవదనుగ్రహంవల్లసిధ్ధులులభిస్తాయనిమనకుతెలుసు.  నిజమైనసాధువుఎపుడూఇటువంటిశక్తులగురించితాపత్రయపడడు.  వాటినిలక్ష్యపెట్టడు.  సాధుకుడికిఆధ్యాత్మికంగాపురోగతిసాధించడానికిఇవన్నీఅడ్డంకులనిస్వామివివేకానందహెచ్చరించారు.  కొంతమందిబాబాలుగానిగురువులుగానిఇటువంటిశక్తులకిదాసోహమయ్యితమశక్తులనుప్రదర్శిస్తారేగానితాముఆధ్యాత్మికంగాఎదగలేరు,తమశిష్యులనికూడాఉన్నతస్థితికితీసుకునివెళ్లలేరు.  సాయిబాబాతనభక్తులకొరకువేటినీసృష్టించిఇవ్వలేదు.  బహుశఅందువల్లనేబాబానుపరీక్షించడానికిశాస్త్రవేత్తలుగాని, ఇంద్రజాలికులుగాని, నాస్తికులు గానిఎవరూసవాలుచేయలేకపోయారు.

కొంతమందిహిందువులుబాబానిచూడగానేఆయనఒకముస్లిమ్అనే భావనతోశిరసువంచినమస్కరించడానికితటపటాయించేవారు.  అదేవిధంగాకొంతమందిమహమ్మదీయులుబాబాహిందూమతాచారాలప్రకారంపూజలుచేస్తూమసీదుయొక్క  పవిత్రతనుచెడగొడుతున్నారనిభావించేవారు.  బాబామీదఇదొక్కటేవిమర్శఉండేది.  కానిఎవరూకుడాబాబానిసవాలుచేయలేదు.  ఎవరికయితె  సందేహాలు, పరిమితులుఉన్నాయోవారంతాబాబానుచూడగానేఆయనపాదాలనాశ్రయించారు.  ఒకరామభక్తుడుబాబాలోరాముడినిదర్శిస్తే, విఠలునిభక్తుడుసాయిలోవిఠలునిరూపాన్నిదర్శించాడు.  ఇదేబాబాలోఉన్నశక్తి.

(చివరి భాగమ్ సోమవారమ్)
(రేపటి సంచికలో ఆణిముత్యాలు 3వ.భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 3 వ.భాగమ్

$
0
0
    Original Photos of Shirdi Sai BabaZeven dagen Shirdi Sai
    Rose - Garden Roses, HD Png Download - 4416x3312(#4698981) - PngFind
12.07.2020  ఆదివారమ్
ఓమ్సాయిశ్రీసాయిజయజయసాయి
సాయిబంధువులకుబాబావారిశుభాశీస్సులు
శ్రీసాయిసాగరంనుండివెలికితీసినఆణిముత్యాలు  3 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనంమరియుకూర్పుశ్రీమతిరావాడమధుగోపాల్
-       సమర్పణఆత్రేయపురపుత్యాగరాజు
16.02.2020  వైద్యసేవలు
నేనుషిరిడీలోశరీరముతోఉన్నరోజులలోషిరిడీగ్రామవాసులకువైద్యసేవలుచేసేవాడిని.  వైద్యానికిలొంగనిరోగాలనునేనునాశరీరముమీదకుతీసుకొనినాభక్తులకుఉపశమనముకలిగించేవాడిని.  ఈనాడునాభక్తులలోచాలామందివైద్యులుఉన్నారు.  వారుఅందరుకలిసినామందిరాలలోఉచితవైద్యశాలలునిర్వహించారు.  నాబీదభక్తులనుఆదుకొన్నచో నేనుచాలాసంతోషించెదను.  నాడాక్టర్భక్తులనుసదా 
కాపాడుతూ ఉంటాను.


     Heart Touching Miracles By Shirdi Sai Baba | Rgyan

17.02.2020  వివాహాలుముహూర్తాలు
వివాహాలకు  సుమూహూర్తాలునిర్ణయించటానికిమంచిజ్యోతిషశాస్త్రపండితులనుసంప్రదించాలి.  మంచిముహూర్తములోవివాహాలనుతమఆత్మీయులతోకలిసిజరిపించాలి.  వివాహాలకుఆర్భాటాలకుపోరాదు.  వివాహాలలోఎంతనిరాడంబరత్వముఉంటే అంతగా భగవంతుని  ఆశీర్వచనాలువధూవరులకులభించుతాయి.
విశ్లేషణ
శ్రీసాయిసత్చరిత్రలోనివీరభద్రప్ప, గౌరికళ్యాణమువిషయములోబాబాలీలలు, చేసినవిషయాలుపైనచెప్పబడినసందేశమునుగుర్తుచేస్తాయి.
18.02.2020  స్వర్గీయులైనతల్లిదండ్రులఆబ్ధీకము
నీవు 2019 .సంవత్సరముశ్రావణమాసములోనీతండ్రికీ.శే.రావాడవెంకటరావుగారికిఆభ్దికముపెట్టినావు.  రోజుననీవునన్నుభోజనానికిపిలవకపోయినానేనునీమిత్రుడుస్వర్గీయసర్దార్జీఅయినఅలువాలియారూపంలోనుమరియునీ  పినతండ్రిస్వర్గీయశ్రీఉపాధ్యాయులసోమయాజులుగారిరూపంలోనుఅదృశ్యరూపాలలోవచ్చిభోజనముచేసివెళ్ళినాను.  నీవునీతండ్రిగారిఫోటోచూపించినీతండ్రినినాకుపరిచయంచేయసాగావు.  నాకునవ్వువచ్చినది.  నీతండ్రిగురించివివరాలుఅన్నీనాకుతెలుసు.  రోజుననీతండ్రిఎక్కడజన్మించినదినేనునీకుచూపించగలను.  నాకుసంతోషముకలిగించినవిషయంనీవునీకుజన్మనిచ్చిననీతండ్రినిమరిచిపోలేదు.  మరియునిన్నుపెంచిపోషించివిద్యాబుధ్ధులునేర్పించిననీపినతండ్రికీ.శే.ఉపాధ్యాయులపేరేశ్వరసోమయాగులుగారినిమరిచిపోలేదు.  నీవునాభక్తులకుపుస్తకముద్వారాతెలియజేయవలసినవిషయముగతించినమీతల్లిడండ్రులకుప్రతిసంవత్సరముఆబ్ధీకముపెట్టండి.”
విశ్లేషణ :
శ్రీసాయిసత్చరిత్రలోనిభగవంతరావుక్షీరసాగర్కధనుగుర్తుచేసుకుందాము.  అతడుతనతండ్రికిఆబ్ధీకముపెట్టడముమానివేసినపుడువానినిషిరిడీకిపిలిచిచివాట్లుపెట్టివానిచేతవానితండ్రికిషిరిడీలోఆబ్ధీకముపెట్టించెను.
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు – 4 వ.భాగమ్

$
0
0
     HOW AND WHY MAZAAR(TOMB) OF A MUSLIM FAQIR PIR SHIRDI SAIBABA WAS ...
           Rose Png Tumblr Images Baptism Pinterest Pink Roses, - Hd Pink ...
13.07.2020  సోమవారమ్
ఓమ్సాయిశ్రీసాయిజయజయసాయి
సాయిబంధువులకుబాబావారిశుభాశీస్సులు.
  బాబాఎవరినీతనశిష్యులుగాచేసుకోలేదుఆయనకువారసులుకూడాలేరుసమాచారమ్shirdisaisevatrust.orgచెన్నైవారినుండిగ్రహింపబడినది.
(సాయిలీలపత్రికనవంబరు, డిసెంబరు 1983 సంచికలోపునర్ముద్రితం.)
తెలుగుఅనువాదం --  ఆత్రేయపురపుత్యాగరాజు
నిజాంపేటహైదరాబాద్
ఫోన్.  9440375411 , 8143626744

సాయిబాబాకువారసులుగానిశిష్యులుగానిలేరు– 4 .భాగమ్
(రచయితకీ.శే. డి. శంకరయ్య)
వ్యాసాన్నిshirdisaisevatrust.org  నుండియధాతధంగాఅనువాదంచేసిప్రచురిస్తున్నానుఅందువల్లఇందులోతెలియపరచబడినఅభిప్రాయాలన్నీశ్రీశంకరయ్యగారివేననిగ్రహించవలెను.)

బాబాఎప్పుడుపుట్టారోతెలియదుఅందువల్లబాబాజన్మదినంరోజునఆయనభక్తులుగురుదక్షిణసమర్పించేసందర్భమేరాదుఆయనజన్మతేదీయేకనకతెలుసుంటేకొంతమందిబాబాలకువచ్చినట్లుగానేఆయనకుకూడాలక్షలాదిరూపాయలుగురుదక్షిణగావచ్చిఉండేవి



బాబాలందరూగురుదక్షిణకువచ్చినసొమ్మునిఒకమంచికార్యానికిఉపయోగిస్తామనిచెబుతారుగాని, ప్రతిమానవుడిలోనుఅంతర్గతంగాఉన్నశక్తినిమేల్కొలపడంకన్నమంచికార్యంఇంకేమన్నాఉంటుందావారంతాతమశక్తినిభక్తులలోఉన్నఅజ్ఞానాన్నితొలగించడానికిఉపయోగించాలిఒకఆధ్యాత్మికగురువుఉన్నాడంటేఅతను తనభక్తులలోఆధ్యాత్మికప్రభావాన్నికలిగించాలిబాబాతనభక్తులనుండిఆశ్రమాలుగానిమఠాలుగాని, భవనాలనుగానుకట్టుకోవాలనిఎప్పుడూఆశించలేదుఆయనపాడుబడినమసీదులోనేనివసించారుకాని, మసీదుకుకొన్నిమరమ్మత్తులుజరిగాయిబాబాప్రకృతిమీదనేఆధారపడ్డారుఇపుడుబాబాలకుఉన్నట్లుగాఆయనకు.సి. లుగాని, ఫానులుగానిలేవుభగవంతుడుసూచించినకొంతమందిభక్తులనుండిమాత్రమేఆయనదక్షిణఅడిగిపుచ్చుకొనేవారుఅందులోఎటువంటిసందేహంలేదుఆయనఎపుడూబ్యాంకులోఖాతాతెరచిడబ్బుదాచుకోలేదుబాబాతనభక్తులలోవివేకము, వైరాగ్యముగురించిబోధించడానికే దక్షిణఅడగటంలోనిముఖ్యోద్దేశంరోజులోవచ్చినదక్షిణనంతాసాయంత్రమయేసరికిపంచిపెట్టేసేవారుచివరికిఆయనమహాసమాధిచెందేనాటికిఏడురూపాయలుమాత్రమేమిగిలాయివాటినిబాబాఅంత్యక్రియలనిమిత్తంఖర్చుచేసారు.

విధంగాబాబానిశ్చింతగా 60 సంవత్సరాలుషిరిడీలోనివశించారుమహాసమాధిచెందినతరువాతకూడాబాబాలీలలనుఎవరయినాతెలుసుకోదలిస్తేసాయిబాబాసంస్థానమువారుప్రచురించినశ్రీసాయిలీలఅనేపుస్తకంచదివితెలుసుకోవచ్చుఇతరులుచెప్పినఅనుభవాలనువినిఆనందపడేకన్నా, మీమీఅహంకారాలనుప్రక్కనపెట్టిఆయనకుశరణాగతిచేసినట్లయితేమీకుకూడాఆయనఅనుభవాలనిస్తారు.

మఠాలు/ఆశ్రమాలుఉన్నాయంటేసాంప్రదాయంప్రకారంవాటిఅధిపతులుతమతదనంతరంతమవారసులుఎవరోముందేనిర్ణయిస్తూఉంటారుమనసాయిబాబాఏభక్తుడిని  కూడా తనతదనంతరంవారసునిగాని, తనశిష్యుడనిగానిప్రకటించలేదు.

సాయిబాబాతరువాతతామేఅవతారాలమనిచెప్పుకునేగురువులు/బాబాలు/స్వామీజీలువిషయాలనుగురించితీవ్రంగాఆలోచించితమతమమాయాజాలశక్తులన్నిటినీద్వారకామాయిలోనిధునిలోదహింపచేయాలని, క్రొత్తగాఆధ్యాత్మికజీవనాన్నిప్రారంభించిసాయితత్త్వాన్నిప్రజలకుఅందించాలనిసలహాఇస్తున్నాను.

బాబాతరువాతతమదేఅధికారమని, వారసులమని, శిష్యులమని, అవతారాలమనేప్రామాణికంలేనివాదనలవల్లనేబహుశసాయిసంస్థానంవారుసాయికిఎవరూవారసులుగాని, శిష్యులుగానిలేరుఅనేప్రకటననితమకార్యాలయంలోఏర్పాటుచేసిఉండవచ్చు.

డి. శంకరయ్య

(సమాప్తమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

నేను ఒంటరివాడిని కాను – బాబా నాకు తోడుగా ఉన్నారు

$
0
0

     Sai My Saviour - Sai Devotee Aishwarya - Shirdi Sai Baba Answers ...
            White Roses: Meaning & History | Flower Glossary

15.07.2020  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

రోజుసాయిలీలద్వైమాసపత్రికమేజూన్ 2000 సంవత్సరంలోప్రచురించినశ్రీకె. షెనాయ్, పూనావారిబాబాలీలఒకటిఅందిస్తున్నాను.
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
విజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744

నేనుఒంటరివాడినికానుబాబానాకుతోడుగాఉన్నారు

1997 .సంవత్సరంనవంబరునెలలోనేను, నాభార్యఇద్దరంఅమెరికాలోఉంటున్నమాఅమ్మాయిఇంటికివెళ్ళాము.  మేముభారతదేశంనుండిబయలుదేరేముందు నాకు విపరీతమయిన బ్రాంకైటిస్.  అంతేకాదు. నేనుషుగర్పేషెంట్నికూడా.  ఆమెరికాలోఉన్నంతకాలంఏమేమిమందులువాడాలోఅన్నీడాక్టర్గారువ్రాసిఇచ్చారు.


అనుకున్నప్రకారంఅమెరికాచేరుకొనిమాఅమ్మాయిఇంట్లోహాయిగాగడుపుతున్నాము.  మేముఎప్పుడూచేసుకునేటట్లుగానేమేము  ప్రేమించే దైవమ్అయినసాయినాధుడినిప్రతిరోజూపూజించుకుంటూ, ఆయననామస్మరణతోకాలంగడుపుతున్నాము.  మేముఅమెరికాలో 3 నెలలుఉందామనుకున్నాము.  అమెరికాకివచ్చిన 13.రోజునఅకస్మాత్తుగానాఛాతీభాగంలోవిపరీతమయిననొప్పిమొదలయింది.  ఆనొప్పినిభరించలేకుండా, ఊపిరికూడాతీసుకోలేనంతగాఉన్నాను.  నేనుఉన్నచోటనేనేలమీదపడుకుండిపోయాను.  సమయంలోమాఅమ్మాయిఅల్లుడుఇద్దరూఆఫీసుకువెళ్ళిపోవడంవల్లఇంట్లోనేను, నాభార్య, మాఅమ్మాయిచిన్నపిల్లలతోఉన్నాము.  నాకుఈస్థితికలిగినపుడునేనుడ్రాయింగ్రూములోఉన్నాను.  నాభార్యవంటయింటిలోఉంది.  అతికష్టంమీదఆమెనిసైగచేసిపిలిచాను.  నాపరిస్థితినిచూసినాభార్యచాలాభయపడిపోయిమాఅమ్మాయికిఫోన్చేసింది.  ఆసమయంలోబయటమంచుకురుస్తుఉంది.  రోడ్డుమీదనుంచిమాఇంటిదాకా 18 అంగుళాలఎత్తువరకుమంచుపేరుకునిఉంది.  బయటిఉష్ణోగ్రతసున్నాడిగ్రీలకన్నాతక్కువగాఉంది. 
                        Picture/Photo: Snow-covered road. Crater Lake National Park

నాపరిస్థితినివిన్నవెంటనేమాఅమ్మాయినిఆమెపనిచేస్తున్నఆఫీసులోనిసహోద్యోగికారులోతీసుకునివచ్చింది.  మంచుతోనిండిఉన్నరోడ్డుమీదకారుడ్రైవ్చేసుకుంటూ 15 నిమిషాలలోనేఇద్దరూఇంటికి చేరుకొన్నారు.

మాఅమ్మాయినాదుస్థితినిచూసి, ఇకక్షణంకూడాఆలోచనలతోసమయంవృధాచేయకుండాఅత్యవసరసేవలవారికిఫోన్చేసినేను పడుతున్నబాధనంతావివరించిచెప్పింది.  10 నిమిషాలలోనేవాళ్ళందరూవైద్యానికిఅవసరమయినవాటన్నిటితోచేరుకొన్నారు. వారిలోఇద్దరువైద్యులుకూడాఉన్నారు.  నన్నుపరీక్షించిఅక్కడికక్కడే E C G తీసారు.  చూసినతరువాతస్ట్రోక్వచ్చిందనీ, వెంటనేగుండెకుఆపరేషన్చేసేవసతిఉన్నఆస్పత్రికితీసుకొనివెళ్ళాలనిచెప్పారు.  మాఇంటికిదగ్గరలోగుండెకుసర్జరీచేసేఆస్పత్రులురెండేఉన్నాయి.  బయటవిపరీతంగామంచుకురుస్తూఉండటంవల్లచాలామట్టుకురోడ్లన్నిమూసుకుపోయిఉన్నాయి.  
                   

నేనుస్పృహలోనేఉన్నాగానికదలలేనిపరిస్థితిలోఉన్నాను.  నన్నుఆస్పత్రికితీసుకువెళ్లద్దు.  నాకుతొందరలోనేనయమవుతుంది.  నాకుభారతదేశంలోనేఅవసరమయినవైద్యంభిస్తుంది.  నేనుఅక్కడికేవెడతాననివేడుకొన్నాను.  అత్యవసరసేవావిభాగంవాళ్ళుఆస్పత్రిలోచేరాల్సిందేనని, అక్కడఉండేవైద్యనిపుణులుతరువాతఏమిచేయాలోవాళ్ళేనిర్ణయిస్తారనిచెప్పారు.  ఆస్పత్రికితీసుకువెళ్ళమంటారనిమమ్మల్నిప్రశ్నించారు.  మాఅల్లుడుతనకుతెలిసున్నఆస్పత్రిపేరుచెప్పాడు.  అక్కడయితేఒకభారతీయవైద్యుడుకుండాఉన్నాడనిఅన్నాడు.  నన్నుస్ట్రెచర్మీదపడుకోబెట్టిమంచుతోనిండిఉన్నరోడ్డుమీదనేఆస్పత్రికితీసుకొనివెళ్లారు.

ఒకఅరగంటలోనేఆస్పత్రికిచేరుకొన్నాము. అక్కడికిచేరుకోగానేఆస్పత్రిసిబ్బందివెంటనేనన్నుఅత్యవసరవిభాగానికితీసుకొనివెళ్లారు.  స్ట్రెచర్మీదనన్నుతీసుకునివెడుతూఉండటంనాకుస్పష్టంగాతెలుస్తూనేఉంది.  నిరంతరంనేనుబాబానేమదిలోనిలుపుకొనిఆయననామాన్నేజపించుకొంటూఉన్నాను.  మవునంగానేమనసులోజపించుకుంటూఉన్నసమయంలోబహుశనేనుఅచేతనావస్థస్థితిలోకిజారుకొనిఉండవచ్చు.  నాకుకాథరైజేషన్తోసహాఅన్నిరకాలపరీక్షలుచేసారనిఒకగంటలోనేనాకర్ధమయింది.  చేసినపరీక్షలలోరక్త నాళాలలో 4 బ్లాకులుఉన్నాయనితేలింది.  వైద్యులు, సర్జన్లతోసహాఅందరూసమావేశమయ్యారు.  ఇకఆలశ్యంచేయకుండావెంటనేఓపెన్హార్ట్బైపాస్సర్జరీచేయల్సిందేననేనిర్ణయానికివచ్చారు.

ఆస్పత్రివాళ్ళువెంటనేఅనస్థటిస్ట్నిరప్పించారు.  అతనువచ్చినరెండుగంటలలోనేసర్జరీప్రారంభమయింది.  నాశరీరానికిఏమిజరుగుతూఉందోనాకేమీతెలియదు. ఎక్కడోప్రశాంతమయినవాతావరణంలోపచ్చికబయళ్ళమీద, తోటలలోనుచాలాఆనందంగావిహరిస్తూఉన్నాను.  నేనుఒక్కడినేకాదని, నాతోపాటుగాసాయినాధ్కూడాఉన్నారనినాకుతెలుసు.  కాలివెనుకభాగంనుండి, తొడలనుండినరాలనుతీసిగుండెకుసంబంధించిననాళాలకుఅతికించిరక్తంగుండెకుసాఫీగాప్రవహించడానికిచేసినసర్జరీకి, సర్జన్ఆయనసహాయకులకి 5 గంటలుపట్టింది.  ఆపరేషన్విజయవంతమయింది.  నేనుస్పృహలోకిరావడానికిమరొక 6 గంటలసమయంపట్టిఉండవచ్చు.  నాఆపరేషన్విజయవంతమయినేనుత్వరగాకోలుకోవాలనినాభార్యసాయినాధుడినిప్రార్ధించుకుంటూనేఉంది.  ఆమెప్రార్ధనలుఫలించాయి.  నాకుస్పృహరాగానేఆనందంతోనిండినకన్నీళ్ళతోనాకెదురుగాకనిపించింది.
(చివరి భాగమ్ 17.07.2020 న ప్రచురించేదానిలో నేను వంటరివాడను కాదు, దీనిని మనం ఏవిధంగా భావించాలి అన్నది చదవండి.  రేపటి సంచికలో ఆణిముత్యాలు 4వ.భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



నేను ఒంటరివాడిని కాను – బాబా నాకు తోడుగా ఉన్నారు – 2 వ.భాగమ్

$
0
0






    Pink roses HD wallpaper | Wallpaper Flare

16.07.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి సుభాశీస్సులు

సాయి లీల ద్వైమాసపత్రికమేజూన్ 2000 సంవత్సరంలోప్రచురించినశ్రీకె. షెనాయ్, పూనావారిబాబాలీలరెండవ భాగమ్.  ఈ రోజు ఆణిముత్యాలు 4 వ.భాగం ప్రచురించి  శుక్రవారం నేను ఒంటరివాడను కాను 2వ.భాగాన్ని ప్రచురిద్దామనుకున్నాను.  మొదటిభాగం చదివినవారు ఆ తరువాత భాగాన్ని చదవడానికి ఆసక్తితో ఉన్నారని భావించి, వారిని నిరాశపరచడం భావ్యం కాదని సాయిభక్తుల కోరికపై ఈ రోజు ప్రచురిస్తున్నాను. 
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744

నేనుఒంటరివాడినికానుబాబానాకుతోడుగాఉన్నారు – 2 వ.భాగమ్

నేను పూర్తిగా స్పృహలోకి వచ్చాను.  నేనెక్కడ ఉన్నానో నాకే తెలియటల్లేదు.  నేనక్కడా లేను, ఇక్కడా లేను.  నేనేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను.  ఒక నిమిషమయిందో లేక రెండు నిమిషాలయిందో తెలియదు.  అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.  ఒక్కసారిగా గ్రహింపుకొచ్చింది.  నేను బాబాతో ఉన్నాను.  నేనాయన హృదయంలోనుండి క్రిందకి నడచుకుంటూ తిరిగి నామంచం మీదకు చేరుకొన్నాను.  ఏదీ సరిగా నిర్ణయించుకోలేని సందిగ్ధావస్థలో ఉన్నాను.
 
       
 On A Trail Of Parks And Gardens In Shirdi
అటువంటి సుందరమయిన ప్రదేశాన్నుండి బాబాని వదలి ఇటువంటి దుఃఖపూరితమయిన ప్రపంచంలోకి ఎందుకు వచ్చానో ఒక్కక్షణం అర్ధం కాలేదు.  నేనాయనకోసం వెతికాను.  కాని ఆయన నాకెక్కడా కనిపించలేదు.  కొంతసేపటి తరవాత బాబా కూడా నాతోపాటే వచ్చి నాహృదయింలోనే ప్రవేశించారనే నిశ్చయానికి వచ్చాను. 

అవును ఆయన నాహృదయంలోనే నిరంతరం ఉంటారు.  నేను బాబాతో కలిసి అటువంటి సుందరమయిన తోటలలో విహరించే అవకాశం మరలా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు.  దాని గురించి నేనింక చింతించడమెందుకు?  బాబాయే నిర్ణయిస్తారు. సర్జరీ అయిన తరవాత నా హృదయంలో ప్రవేశించినవి కొత్తగా అతికించిన రక్తనాళాలు కావు.  దాని బదులుగా నాలో కలిగిన ఒక కొత్త ఆలోచన, నేను ఒంటరివాడిని కానుఅనేదే.  బాబా ఎప్పుడూ నాకు తోడూనీడగా ఉన్నారు.  ఆయన మనలని ప్రేమిస్తారు, జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతూ రక్షిస్తారు.

‘నేను ఒంటరివాడను కాను, బాబా నాకు తోడుగా ఉన్నారు’ఇది పూర్తిగా నాకు సంబంధించినదే కాదు.  ఈ విషయం ప్రతిసాయి భక్తుడికి నిశ్చయింపబడిన విషయం అన్నది యదార్ధం.  మనం ఆయన ఉన్నారనే విషయాన్ని ఎఱుకతో ఉండాలి.  మనం ఏమి మాట్లాడినా, ఏమి చేసినా, చేస్తున్నా ప్రతిదానిని గమనిస్తూ బాబా మనతోనే ఉంటూ ఉంటారు.  మనం మాటలాడె ప్రతిమాటకీ, ప్రతిపనికి ఆయన ప్రత్యక్షసాక్షి.  మనం మాటలాడె ప్రతిమాట మనలో కలిగే ఆలోచనల ప్రభావమే అనేది మనం గ్రహించుకుంటే మనలో మార్పు సహజంగానే వస్తుంది.

మన మాటలకి, చేతలకి బాబాగారి ఆమోదం ఉంటుంది.  మనలో ‘నేను’ అనే అహం పూర్తిగా పటాపంచలయిపోతుంది.  మనం మాటలాడె మాటలలో మార్పు వచ్చి మృదువుగా మాట్లాడతాము.  ఇతరులయెడల ఎంతో మర్యాదగాను, గౌరవంగాను ప్రవర్తిస్తాము.  ఇతరులని కూడా ప్రశంసించే గుణం అలవడుతుంది.  ‘మీరు చాలా మంచిపని చేసారండి’ అని ఎదటివారిని ఎంతో గౌరవంగా మెచ్చుకొంటాము. దీనికి కారణమేమిటంటే ఎదుటివానిలో కూడా బాబాయే ఉన్నారని మనం భావించడం వల్లనే.  ఒకవేళ మనం ఏదయినా తప్పుచేసినట్లయితే “అవును నిజమే నేను తప్పు చేసాను” అని ఒప్పుకుంటాము.  మనలో ఉన్న లోపాలను ఒప్పుకోవడమంటే అదెంత కష్టమో నాకు తెలుసు.

కాని బాబా మనలోనే ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుంటే అదంత పెద్ద కష్టమయినదేమీ కాదు.  అపుడు ‘నేను’ అనేది నశించిపోతుంది. ‘నేను’స్థానంలో ‘మేము’వచ్చి చేరుతుంది. ఆ విధంగా మన జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది.
(ఇక్కడ మేము అనగా బాబాతో కలిసి అని భావించాలి.  మన హృదయంలో బాబా ఉన్నప్పుడు ‘మేము’ అని సంబోధించాలి….   త్యాగరాజు)

మరొక విషయం ఏమిటంటే సాధారణంగా మనం ‘నేను చేసాను, నేను చెప్పాను, నేనది చేసాను, ఇది చేసాను’ అని మాట్లాడుతూ ఉంటాము.  దాని బదులుగా మనం,  ‘మనం ఇది చేద్దాము, మనం అది చేద్దాము ‘ అని అనడం అలవాటు చేసుకోవాలి.  అనగా మనం ఏమిచేస్తున్నా ఏమి మాట్లాడినా బాబాని కూడా కలుపుకుని మాట్లాడాలి.  బాబా లేకుండా నేనే లేను.  ప్రతీదీ చేసేది, చేయించేది  ఆయనే.  మనం ఆయన చేతిలో ఒక పనిముట్టు మాత్రమే.  ఎనిమిది అక్షరాలు అయిన “I AM NOT ALONE, BABA IS WITH ME’ ఈ మంత్రాన్నే మనం ప్రతిరోజూ ప్రతిక్షణం మననం చేసుకొంటూ ఉంటే ఆయన మనతోనే ఉన్నారనే భావన కలుగుతుంది.

కె. షెనాయ్,  కొథ్రుడ్, పూనె,
 నా అభిప్రాయమ్
( ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని కూడా మీకందరికీ తెలియచేస్తున్నాను.  నేను ఇతరులకి ఏమి చెప్పినా సరే బాబా నాచేత చేయించారు అనే చెబుతూ ఉంటాను.  బాబా గురించిన పుస్తకాలు ప్రచురింపబడినా ‘నేను’అనే పదాన్ని తొలగించి బాబాయే ప్రచురింపచేసుకున్నారని చెబుతూ ఉంటాను.  ప్రతిపనిలోను, ప్రతివిషయంలోను బాబాని కలుపుకోవాలి.  నేను ఉదయాన్నే కాఫీతాగడం ప్రారంభించినా, ‘బాబా కాఫీ తాగుదాం రండి,   భోజనం చేయడానికి ముందు ఆయనకు సమర్పించి ఆ తరువాత, బాబా భోజనం చేద్దాం రండి, స్నానానికి వెళ్ళినా బాబా స్నానం చేద్దాం రండి’ అని మనసులోనే ఆయనని కలుపుకుంటూ ఉంటాను.  కొన్ని సంవత్సరాల క్రితం నేను స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు, “బాబా వెనకాల కూర్చోండి, కూర్చున్నారా? అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడిని”  ఆవిధంగా మనం సాధన చేస్తే అదే అలవాటయిపోతుంది. బజారుకు వెళ్ళే సమయంలో కూడా, “బాబా బజారుకు వెడదామా, కూరలు తెచ్చుకుందాం రండి” అని  గుర్తుకొచ్చినపుడు ఆయనని కూడా మనసులో పిలుస్తూ ఉంటాను.   ఒక్కోసారి మర్చిపోతూ ఉండవచ్చు.  ఇకనుండి మరచిపోకుండా ఉంటాను.

ప్రతివిషయంలోను బాబాని మనం కలుపుకుని పోతూ ఉండాలి.  నేను ఆచరిస్తున్నాను కనకనే మీకు కూడా చెప్పగలిగాను.  నేను ఆచరించకపోతే నాకు ఆవిధంగా చెప్పే అర్హతే లేదు.  ఈ బ్లాగు కూడా బాబాదే.  ఆయనే వ్రాయించుకుంటున్నారు.  బాబా చేతిలో నేనొక సాధనాన్ని మాత్రమే…. ఓమ్ సాయిరామ్…. త్యాగరాజు)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.3. లోభి ఎక్కడనున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, బాబాను కూడ నెల్లరు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక.      శ్రీ సాయి సత్ చరిత్ర అ.14 ప్రతినిత్యము సాయిలీలలు వినినచో, నీవు శ్రీ సాయిని చూడగలవు.  నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము.)

(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 5 వ.భాగమ్

$
0
0

     Sai Baba of Shirdi - Wikipedia
         light pink rose.jpg (1 comment) Hi-Res 720p HD
19.07.2020  ఆదివారమ్
ఓమ్సాయిశ్రీసాయిజయజయసాయి
సాయిబంధువులకుబాబావారిశుభాశీస్సులు
శ్రీసాయిసాగరంనుండివెలికితీసినఆణిముత్యాలు5 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనంమరియుకూర్పుశ్రీమతిరావాడమధుగోపాల్
-       సమర్పణఆత్రేయపురపుత్యాగరాజు
9.  బాలిదేశములోశివరాత్రి
21.02.2020  శుక్రవారమ్ (శివరాత్రి)
నిన్నటిరోజుననీకుభారతదేశములోనిరామేశ్వరంమరియుశ్రీరాములవారిపల్లెలనుచూపించాను.  రోజుననిన్నుమరపడవలోరామేశ్వరంనుండిబాలి (వాలి) దేశానికితీసుకొనివెడతాను.  అక్కడనీకురామాయణనాటకము, శ్రీరామాలయప్రాంగణములోశివపార్వతులనృత్యముమరియునీఇష్టదేవతఅయినకామధేనువునుచూపించుతానునాతోరాఅన్నారుఫకిరుసాయిబాబా.


నేను (సాయిబానిస) మరియుఫకీరుసాయిబాబాకలిసిఒకమరపడవలోసూర్యోదయమువేళరామేశ్వరసముద్రజలాలమీదుగాబాలిదేశానికిబయలుదేరాము.  సాయంత్రమువేళమేముబాలిదేశానికిచేరుకొన్నాము.  సమీపతీరంలోఒకశివాలయముంది.  సముద్రకెరటాలుశివలింగానికిఅనుక్షణముసముద్రజలాలతోఅభిషేకంచేస్తున్నాయి.  మందిరముమెట్లుఒకచిన్నఅడవిలోనికివెళ్ళసాగినవి. నేను,ఫకీరుబాబాఅడవిలోనికిచేరుకొన్నాము.
      Shiva Temple, Bali Temples
(బాలి ద్వీపం ఇండోనేషియాలోని శివుని ఆలయం)

అడవిలోచాలాకోతులుఉన్నాయి.  బాబానుచూసినకోతులుమా నుండిదూరంగావెళ్ళిపోయినవి.  బాబాకోతులనుచూచిఇవిఆనాటివాలిసంతానము.  అవినన్నుచూసిపారిపోయినవి.  ఇకనీవుఒంటరిగాదగ్గరలోనిచిన్నపట్టణములోనికివెళ్ళిరాత్రిఅంతగడిపితిరిగిసూర్యోదయవేళకుసముద్రతీరంలోఉన్నశివాలయానికిరా.  నేనునిన్నుతిరిగిభారతదేశంతీసుకొనివెళతానుఅన్నారు.  నేనుఒంటరిగాపట్టణములోనికివెళ్ళాను. 

పట్టణములోరాత్రివేళఒకబహిరంగనాటకశాలలోశ్రీరామాయణనాటకముప్రదర్శించుతున్నారు.  నాదగ్గరటికెట్టుకొనడానికిడబ్బులేదుఅనిఅక్కడికాపలాదారునికిచెప్పినాను.  అతడునన్నులోనికిపంపినాడు.  నేనునాటకములోశ్రీరామపట్టాభీషేకముచూసిబయటకువచ్చిదగ్గరలోనిరామాలయానికివెళ్ళినాను.  అక్కడరంగస్థలంమీదశివపార్వతుల నృత్యముచూసిఆనందించాను.  తెల్లవారసాగింది.  ఆకలివేస్తుంటేదగ్గరలోనిఒకరోడ్డుప్రక్కనఉన్నహోటల్కువెళ్ళాను.  హోటల్యజమానురాలునన్నుచూసినీవుభారతదేశంనుండివచ్చినావు, నీకుఆకలివేస్తోందికదూ?  ఇక్కడబయటఉన్నకుర్చీలోకూర్చో, నేనునీకుసమోసాలు, ఉల్లిపాయకొద్దిగాబియ్యముతెచ్చిపెడతాను.  వాటినితినితిరిగినీవునీదేశానికివెళ్ళిపోఅంది.

హోటల్యజమానురాలునాకుఒకప్లేటులోనాలుగుసమోసాలు, ఒకఉల్లిపాయతెచ్చితినమంది.  నేనుకడుపునిండావాటినితిన్నాను.  ఇంతలోతెల్లవారసాగింది.  హోటల్దగ్గరలోనితోటలోనుండిఒకపెద్దఆవునాదగ్గరకువచ్చింది.  ఆవుసుమారుఆరుఅడుగులఎత్తుఉంది.  కొమ్ములకుబంగారుతొడుగుఉంది.  మెడలోముత్యాలహారంఉంది. నాదగ్గరకువచ్చితననాలుకతోనాశిరస్సునాకితరువాతతనవెనుకభాగమునావైపుపెట్టినాశిరసుమీదమూత్రాభిషేకంచేయసాగింది.  నేనుసంతోషముతోసాయి సాంబశివసాయిసాంబశివఅంటునిద్రనుండిలేచాను.
10.  గతజీవితస్నేహాలుబంధాలు
22.02.2020  శనివారమ్
వృధ్ధాప్యములోఉన్నవారికివారిగతజీవితస్నేహాలు, బంధాలు, మానసికముగాబాధనుకలిగించి, వారిఆధ్యాత్మికప్రగతికిఅవరోధంఅవుతాయి.  అందుచేతగతజీవితంలోనికితొంగిచూడకు.  గతాన్నిపూర్తిగామరిచిపోయివర్తమానంలోప్రశాంతముగాజీవించు.  భవిష్యత్కాలమునుభగవంతునికిఅర్పించు.  భవిష్యత్గురించిఆశలుపెట్టుకోవద్దు.  వర్తమానంలోప్రయాణంచేస్తూనీజీవితగమ్యాన్నిచేరుకో -   -------      బాబా
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)



నల్ల కుక్కకు పెరుగన్నమ్

$
0
0

    Shri Shirdi Sai Baba Temple, West Mambalam - Temples in Chennai ...
              Pink Rose - Pink Love - Pink - Roses | Flower Muse | Pink rose ...

20.07.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈరోజు మరొక అధ్భుతమయిన సాయిలీలను ప్రచురిస్తున్నాను. మనకు బాబామీద ఎంత నమ్మకం ఉంటుందో అంతగా ఆయన అనుగ్రహం      మనమీద ఉంటుంది.  శ్రీమతి వందనా కామత్ గారి ఈ లీల సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2009 వ.సంవత్సరంలో ప్రచురించినదానికి తెలుగు అనువాదమ్.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్  : 9440375411 & 8143626744
(ఈరోజు 20.07.2020 నాడు బాబా ఇచ్చిన సందేశం – నిరుద్యోగి అయిన కుమారునికి తను పనిచేస్తున్న కార్యాలయంలో ఉద్యోగం  వేయించడం కోసం స్వఛ్చంద పదవీ విరమణ చేయవద్దన్నారు.)

నల్ల కుక్కకు పెరుగన్నమ్

శ్రీమతి వందనా కామత్ గారు బెంగళురులో ఒక అద్దె ఇంటిలో తన కుటుంబంతో నివసిస్తున్నారు.  వారికి ఎన్నో ఆర్ధికపరమయిన ఇబ్బందులు ఉన్నాయి.

వారికి బాబా గురించి అసలు తెలియదు.  కాని బాబా అనుగ్రహం వారియందు ఉండటంవల్ల, వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కోడలు వారికి శ్రీసాయి సత్ చరిత్ర ఇచ్చి అంతా బాబాయే చూసుకుంటారని చెప్పింది.

ఒకరోజు ఇంటి యజమాని వచ్చి వారిని ఇళ్ళు ఖాళీ చేయమని చెప్పాడు.  ఆమాటలు వినగానే వారంతా చాలా సంకటంలో పడ్డారు.  తాము ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి వెంటనే మరొక క్రొత్త ఇంటికి మారాలంటే డబ్బు సమస్య.  ఏమిచేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు.  అటువంటి పరిస్థితులలో వారికి షిరిడీ వెళ్ళే అవకాశం లభించింది.  షిరిడీనించి తిరిగి రాగానే శ్రీమతి వందన తన కుటుంబానికి పరిచయం  ఉన్న తన స్నేహితురాలిని కలుసుకొని పరిస్థితినంతా వివరించింది.

ఆమె ఒక క్రొత్త ఇంటిని కొనుగోలు చేయమని సలహా ఇచ్చింది.  శ్రీమతి వందనకి తన ఆర్ధికపరిస్థితిని తలచుకుంటే క్రొత్త ఇంటిని కొనడం అసాధ్యమయిన పని.  ఇపుడు ఉంటున్న ఇంటికే అద్దె కట్టలేని స్థితిలో ఉంటే ఇక క్రొత్త ఇల్లు కొనడమనే ప్రసక్తే కనిపించడంలేదు.  కాని, ఆమె స్నేహితురాలు ఆమెకు రూ.75,000/- ఇచ్చి బాబామందిరం ప్రక్కనే ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కొనుక్కోమని చెప్పింది.  వందన కుటుంబం ఆమె చేసిన సహాయానికి ఎంతో సంతోషించారు.  కాని వచ్చిన చిక్కు ఆ స్థలం ధర లక్షల్లో ఉంది.  స్థలం కొనడానికి తగిన ధనం కూడా లేదు.

ఇలా ఉండగా వందన మామగారు మరణించారు.  ఆయన రాసిన విల్లుప్రకారం వారికి లక్షరూపాయలు వచ్చాయి.  వెంటనే కొన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ స్థలం కొన్నారు.

అప్పటినుండి కుటుంబమంతా బాబాని పూజించడం ప్రారంభించారు.  స్థలంకొని శంకుస్థాపన చేసారు.  ఆర్ధిక ఇబ్బందుల వల్ల సంవత్సరం దాటినా ఇల్లు కట్టడం ప్రారంభం కాలేదు.  ఇదే సమయంలో శ్రీమతి వందనకి శ్రీ సాయి సత్ చరిత్రలోని ఒక అధ్యాయంలోని విషయం గుర్తుకు వచ్చింది.  అందులో ఒక భక్తుడు తన కోరిక తీరడానికి నల్లకుక్కకు పెరుగన్నం పెట్టడమ్ అతని కోరిక తీరడం గురించిన ప్రస్తావన ఉంది.
       Sai Is Helping Hand In Our Times Of Need ~ Mahaparayan Experiences
(Why did Baba give me this chapter of Sai Satcharitra?
 I could find a right solution at last)
అపుడామె  ఏడు గురువారాలపాటు నల్లకుక్కకు పెరుగన్నం పెడతానని, తనకు ఇల్లు కట్టుకునే భాగ్యాన్ని కలిగించమని బాబాని ప్రార్ధించుకుంది.

మొట్టమొదటి గురువారమునాడు ఆమె పెరుగన్నం కలిపి ఒక ప్లేటులో ఇంటి బయట పెట్టి నల్లకుక్క కోసం ఎదురు చూడసాగింది.  కొంతసేపటి తరవాత ఒకనల్ల కుక్క వచ్చింది.  కాని దాని శరీరం మీద అక్కడక్కడ తెల్లటి మచ్చలు ఉన్నాయి.  వచ్చిన కుక్క పూర్తిగా నలుపురంగులో లేకపోవడం వల్ల దానికి ఆపెరుగన్నం పెట్టవచ్చా లేదా అనే సందేహంలో పడింది.  ఆశ్చర్యకరంగా ఆకుక్క అన్నంప్లేటు వద్దకు రావడం, వాసన చూసి వెనకకు వెళ్ళడం ఇలా 10 -15 నిమిషాలపాటు చేసి ఆఖరికి అన్నం తినకుండానే వెళ్ళిపోయింది.  శ్రీమతి వందన చాలా సేపు ఎదురు చూసింది.  నల్లకుక్క ఏదీ రాకపోవడంతో చాలా నిరాశకు గురయ్యింది.

కొంతసేపటి తరువాత అదేకుక్క మరొక కుక్కను వెంటబెట్టుకుని వచ్చింది.  ఆకుక్క పూర్తిగా నల్లటి రంగులో ఉంది.  ఆనల్ల  కుక్క ఎంతో ఆత్రంగా పెరుగన్నాన్ని తిని కాస్త అన్నం తెల్లమచ్చలు ఉన్న కుక్కకి వదిలి పెట్టింది.  ఆ కుక్క మిగిలిన అన్నాన్ని తిన్న తరువాత రెండు కుక్కలు సంతోషంగా తోకాడించుకుంటూ వెళ్ళిపోయాయి.  ఈ దృశ్యం చూసిన తరువాత ఇల్లు కట్టుకోవడానికి బాబా తనకు సహాయం చేస్తారన్న పూర్తి నమ్మకం కలిగింది.  నిజానికి వారికెంత ఆర్ధిక ఇబ్బందులున్నా ఈ సంఘటన జరిగిన అయిదు నెలలలోనే  బాబా ఆశీర్వాద బలంతో వారు ఇల్లు కట్టుకోగలిగారు.

అప్పటినుండి శ్రీమతి వందనకి ఆమె కుటుంబానికి సాయియందు ప్రగాఢమయిన భక్తివిశ్వాసాలు ఏర్పడి తమ జీవితాలని బాబాకి అంకితం చేసారు. ‘సాయిస్మరణ్’ పేరుతో ఒక బృందంగా ఏర్పడి గత పదకొండు సంవత్సరాలనుండి బెంగళురులోని ప్రతి సాయిభక్తుని ఇంటిలో సాయిభజనలు చేయసాగారు.  అంతే కాకుండా ప్రతిసంవత్సరం సభ్యులందరూ కలిసి (150 నుండి 300 మంది వరకు) షిరిడీ వెళ్ళి అక్కడ భజనలు పల్లకీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈరోజున వారు మరొక మూడు అంతస్థులు వేసి ఒక అంతస్థుని పూర్తిగా బాబాకోసమే కేటాయించారు.  అందులో బాబా విగ్రహాన్ని, బాబా ఫోటొలను పెట్టి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు.  ప్రతి గురువారం భజనలు, రామనవమి, గురుపూర్ణిమ, విజయదశమి రోజులలో వందలాది మంది భక్తులు అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక సాగరంలో మునిగి తేలుతూ ఉంటారు.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Viewing all 726 articles
Browse latest View live